తన అందం అభినయంతో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకొని చిత్ర పరిశ్రమలోనే మహనటి అనే బిరుదును సంపాదించుకుంది నటి సావిత్రి. ఈమె సినిమాలలోకి రావడానికి ఎన్నో ఇబ్బందులు ఎదురుకొని తెలుగులోనే కాకుండా తమీళంలో కుడా స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. తన నటనతో ఏలాంటి పాత్రకైన జీవం పోయగల సావిత్రి.. ఏఎన్నార్ చేసిన పని వల్ల సీనియర్ ఎన్టీఆర్ని దూరం పెట్టిందట.
ఇక అసలు విషయం ఏంమిటి అంటే తెలుగు చిత్ర పరిశ్రమకు ఏఎన్నార్, ఎన్టీఆర్ రెండు కళ్ళు లాంటి వారు.. ఆ రోజుల్లో ఇద్దరు తమ సినిమాలతో పోటీపడి నటించేవారు. అదే సమయంలో ఏఎన్నార్ మాత్రం ఎన్టీఆర్ సినిమాలకు హీరోయిన్ల డేట్స్ ఇవ్వకుండా మొత్తం తన సినిమాలకే ఎక్కువగా డేట్లు లాక్ చేసి పెట్టుకునేవాడు. అలా అప్పటి స్టార్ హీరోయిన్లు అయిన అంజలీదేవి, సావిత్రి, భానుమతి వంటి వారి కాల్ షీట్లను కూడా ఏఎన్నార్ రెండు మూడు సంవత్సరాల పాటు బ్లాక్ చేసి పెట్టేవాడు.
అలా సావిత్రి విషయంలో కూడా ఏఎన్నార్ మూడు సంవత్సరాల పాటు ఏ స్టార్ హీరోకి కూడా చాన్స్ ఇవ్వకుండా లాక్ చేసి పెట్టుకున్నాడు. ఇక ఈ విషయంలో చాలాసార్లు సీనియర్ ఎన్టీఆర్- సావిత్రిని ఎందుకమ్మా నాతో సినిమాలు చేయ్యడం లేదు అని అడిగితే నన్నేం చేయమంటారండి ఏఎన్నార్ గారు నా డేట్స్ అన్ని లాక్ చేసి పెట్టారు అనేది. అయితే ఈ విషయంలో ఎన్టీఆర్కి కోపం పెరిగి ఎంతో మంది కొత్త కొత్త హీరోయిన్లు ఇండస్ట్రీకి పరిచయం చేశారు.
అలా ఎన్టీఆర్ హీరోయిన్లుగా పరిచయం చేసిన వారిలో దేవిక, బి సరోజా దేవి, కృష్ణకుమారి వంటి వారు తెలుగులో స్టార్ హీరోయిన్లుగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇలా ఏఎన్నార్- సావిత్రి డేట్స్ ని బ్లాక్ చేసి పెట్టడం వల్ల మిగతా హీరోలతో నటించే ఛాన్స్ సావిత్రి మిస్సయింది. ఈ కారణంతో సావిత్రిని చివరి రోజుల్లో చాలా మంది స్టార్ హీరోలు సైతం దూరం పెట్టారు.