ప్రముఖ హీరోయిన్ సమంతపై ఓ తమిళ నిర్మాత సంచలన వ్యాఖ్యలు చేశారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. నేషనల్ క్రష్ రష్మిక మందన్నా తాజాగా ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమాకు సైన్ చేసిన సంగతి తెలిసిందే. అదే `రెయిన్బో`. ఇందులో మలయాళ నటుడు దేవ్ మోహన్ కీలక పాత్రను పోషిస్తున్నాడు.
తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందుతోన్న ఈ ఫిమేల్ సెంట్రిక్ మూవీ సోమవారం లాంఛనంగా ప్రారంభమైంది. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ పై ఎస్ఆర్ ప్రభు, ఎస్ఆర్ ప్రకాష్ బాబు నిర్మిస్తున్న ఈ చిత్రానికి నూతన డైరెక్టర్ శాంతరూబన్ దర్శకత్వం వహించబోతున్నాడు. ఏప్రిల్ రెండో వారం నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. అయితే నిజానికి ఈ ప్రాజెక్ట్ కోసం మొదట సమంతను తీసుకున్నట్లు మేకర్స్ గతంలో అనౌన్స్ చేశారు. కానీ, అనూహ్యంగా ఆమె స్థానంలో రష్మిక వచ్చింది.
ఇదే విషయాన్ని మీడియా నిర్మాత ఎస్ఆర్ ప్రభు ను ప్రశ్నించగా.. ఆయన షాకింగ్ ఆన్సర్ ఇచ్చారు. `మంచి స్క్రిప్ట్ లు, క్రియేటర్స్ రైట్ ప్లేస్లో రైట్ పర్సన్ని ఎంపిక చేసుకుంటాయి. మేం అదే నమ్ముతాం. ఆ ఫ్లోని మేం మార్చాలనుకోవడం లేదు. కంటెంట్, కర్మ అలా జరుగుతూ వెళ్తుంటాయి. వాటిని ఎవరూ మార్చలేరు` అని వెల్లడించారు. రెయిన్బో చేయకపోవడం సమంత కర్మ అన్నట్లు సదరు నిర్మాత వ్యాఖ్యానించారు. దాంతో సమంత అభిమానులు ఆయన వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడుతున్నారు.