యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో తన 30 చిత్రాన్ని చేస్తున్న సంగతి తెలిసిందే. `ఎన్టీఆర్ 30` వర్కింగ్ టైటిల్ తో పట్టాలెక్కిన ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ బ్యానర్లపై పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.
ఇందులో బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ హీరోయిన్ గా అలరించబోతోంది. అలాగే ఈ హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ లో ఎన్టీఆర్ కు విలన్ గా బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నారు. ఈ విషయాన్ని ఆల్రెడీ చిత్ర టీమ్ ధృవీకరించింది. ఈ మేరకు ఓ ఫోటోను సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. ఎన్టీఆర్ 30 సినిమా సెట్స్లోకి సైఫ్ అలీ ఖాన్ అడుగుపెట్టాడని పేర్కొంది.
అయితే ఈ చిత్రానికి సైఫ్ అలీ ఖాన్ అందుకుంటున్న రెమ్యునరేషన్ హాట్ టాపిక్ గా మారింది. `ఎన్టీఆర్ 30`కి ఆయన రూ. 5 కోట్ల రేంజ్ లో రెమ్యునరేషన్ ఛార్జ్ చేస్తున్నారట. అలాగే బాలీవుడ్ లో సినిమా విడుదల తర్వాత వచ్చే లాభాల్లో కొంత షేర్ ను కూడా తీసుకోబోతున్నారట. మొత్తంగా `ఎన్టీఆర్ 30`కి సైఫ్ రెమ్యునరేషన్ లో రూ. 10 కోట్లకు పైగా ఉంటుందని ఇన్సైడ్ టాక్ నడుస్తోంది.