`గేమ్ ఛేంజ‌ర్‌`కు ఫ‌స్ట్ ఛాయిస్ చ‌ర‌ణ్ కాదు.. బిగ్ బాంబ్ పేల్చిన దిల్ రాజు!

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, ఇండియ‌న్ స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్ లో రూపుదిద్దుకుంటున్న పాన్ ఇండియా చిత్రం `గేమ్ ఛేంజ‌ర్‌`. పొలిటిక‌ల్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ గా తెర‌కెక్కుతున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై దిల్‌ రాజు నిర్మిస్తున్నారు.

ఇందులో కియారా అద్వానీ, అంజ‌లి హీరోయిన్లుగా న‌టిస్తే.. ప్ర‌ముఖ ద‌ర్శ‌క‌, న‌టుడు ఎస్.జె.సూర్య విల‌న్ గా అల‌రించ‌బోతున్నాడు. ఇప్ప‌టికే ఈ మూవీ షూటింగ్ అర‌వై శాతం కంప్లీట్ అయింది. ఇదిలా ఉంటే.. తాజాగా నిర్మాత దిల్ రాజు `గేమ్ ఛేంజ‌ర్‌`కు ఫ‌స్ట్ ఛాయిస్ చ‌ర‌ణ్ కాదంటూ బిగ్ బాంబ్ పేల్చారు.

 

చిత్రసీమలో తన 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సంద‌ర్భంగా మీడియాతో ఇంట్రాక్ట్ అయిన దిల్ రాజ్‌.. గేమ్ ఛేంజ‌ర్ కు మొద‌ట అనుకున్న హీరో రామ్ చ‌ర‌ణ్ కాద‌ని వెల్ల‌డించారు. డైరెక్ట‌ర్ శంక‌ర్ ఈ మూవీని ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో చేయాల‌ని అనుకున్నాడ‌ట‌. ఇదే విష‌యాన్ని దిల్ రాజుకు చెప్ప‌గా.. అందుకు ఆయ‌న ఒప్పుకోలేద‌ట‌. ప‌వ‌న్ క‌ళ్యాణ్ కంటే ఈ క‌థ రామ్ చ‌ర‌ణ్ కు బాగా సూట్ అవుతుంద‌ని దిల్ చెప్పాడ‌ట‌. దాంతో శంక‌ర్ ఫోన్ లోనే చ‌ర‌ణ్ కు క‌థ వినిపించాడ‌ట‌. స్టోరీ అద్భుతంగా ఉండ‌టంతో రామ్ చ‌ర‌ణ్ వెంట‌నే సినిమా చేసేందుకు ఎస్ చెప్పాశాడ‌ట‌. మొత్తానికి ప‌వ‌న్ క‌ళ్యాణ్ చేయాల్సిన గేమ్ ఛేంజ‌ర్‌.. రామ్ చ‌ర‌ణ్ చేతికి వ‌చ్చింది.