టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మోస్ట్ లవబుల్ కపుల్ గా గుర్తింపు తెచ్చుకున్న ఉపాసన, రాంచరణ్ జంట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మెగా హీరోగా గ్లోబల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న రాంచరణ్ 2012లో అపోలో హాస్పిటల్స్ అధినేత ప్రతాపరెడ్డి మనవరాలు ఉపాసన కామినేనిని వివాహం చేసుకున్నారు. ఇక పెళ్లయిన ఇన్ని సంవత్సరాల తర్వాత వీరు త్వరలోనే పండంటి బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. ఇదిలా ఉండగా వీరికి సంబంధించిన ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతుంది.
రామ్ చరణ్ , ఉపాసన దంపతుల మధ్య ఏజ్ గ్యాప్ ఇప్పుడు వైరల్ గా మారుతోంది. ఇక రామ్ చరణ్, ఉపాసనల మధ్య నాలుగు సంవత్సరాల ఏజ్ గ్యాప్ ఉందని తెలుస్తోంది. అయితే కామన్ ఫ్రెండ్ ద్వారా వీరిద్దరి పరిచయం ఏర్పడింది.. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి పెద్దలను ఒప్పించి వివాహం చేసుకుంది ఈ జంట ఇకపోతే ఆగస్టు నెలలో పండంటి బిడ్డకు జన్మనివ్వబోతున్నామని ప్రకటించారు. ప్రస్తుతం ఉపాసన రాంచరణ్ దంపతులు దుబాయ్ లో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నారు.
అక్కడే ఆమెకు సీమంతం వేడుకలు కూడా చాలా సింపుల్ గా జరిగినట్లు తెలుస్తోంది. ఇకపోతే రామ్ చరణ్ సినిమాల విషయానికి వస్తే.. ఆర్ ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈయన ఇప్పుడు శంకర్ డైరెక్షన్ లో తన 15వ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. ఇక ఈ సినిమా పాన్ ఇండియా వైడ్ గా విడుదల కాబోతోంది ఇందులో బాలీవుడ్ బ్యూటీ కియార అద్వాని హీరోయిన్గా నటిస్తోంది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏ విధంగా ఆకట్టుకుంటుందో చూడాలి. కొంత భాగం పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే మొదలు పెట్టబోతున్నట్లు తెలుస్తోంది.