మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ప్రముఖ స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో రూపుదిద్దుకుంటున్న పాన్ ఇండియా చిత్రం `గేమ్ ఛేంజర్`. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై దిల్రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ, అంజలి హీరోయిన్లుగా నటిస్తున్నారు.
ఎస్.జె.సూర్య, అంజలి, శ్రీకాంత్, జయరామ్, నవీన్ చంద్ర తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలను పోషిస్తున్నారు. ఎస్.ఎస్. థమన్ స్వరాలు అందిస్తున్నాడు. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. అయితే ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ తెరపైకి వచ్చింది.
అదేంటంటే.. ఈ సినిమాలో కియారా అద్వానీ పోషిస్తున్న పాత్ర కోసం మేకర్స్ ముందుగా నేషనల్ క్రష్ రష్మిక మందన్నాను సంప్రదించారట. కానీ, ఆమె ఈ సినిమాను రిజెక్ట్ చేసిందట. ఎందుకంటే, మెయిన్ హీరోయిన్ అయినప్పటికీ.. ఆ పాత్రకు ఎలాంటి ప్రాధాన్యత ఉండదట. కేవలం గ్లామర్ షోకు, సాంగ్స్ కు మాత్రమే పరిమితం అన్నట్లు ఉంటుందట. ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే అంజలి పాత్రకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుందట. అంజలి పాత్ర మెయిన్ హీరోయిన్ పాత్రను పూర్తిగా డామినేట్ చేస్తుందట. అందుకే రష్మిక నో చెప్పిందని ప్రచారం జరుగుతోంది. మరి ఇది ఎంత వరకు నిజం అన్నది తెలియాల్సి ఉంది.