ప్రముఖ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం `శాకుంతలం` ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఏప్రిల్ 14న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతోంది. ఇందులో సమంతకు జోడీగా మలయాళ నటుడు దేవ్ మోహన్ నటించాడు.
`యశోద`తో గత ఏడాది సూపర్ హిట్ అందుకున్న సమంత.. ఈ మూవీతో సక్సెస్ ట్రాక్ ను కొనసాగించాలని చూస్తోంది. ఇకపోతే శాకుంతలం ప్రమోషన్స్ లో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సమంత.. ఫుడ్ విషయంలో తన ఫీలింగ్స్ ను బయటపెట్టింది. ఏయే ఫుడ్స్ అంటే ఇష్టమో రివీల్ చేసింది. ఓనటిగా ఫిట్ గా ఉండేందుకు పీనట్ బటర్, ఓట్స్ లాంటివి ఎన్ని తీసుకున్నా బ్రేక్ ఫాస్ట్ లో ఇడ్లీ సాంబార్ ఉందంటే మాత్రం పండగ చేసుకుంటానని..సాంబార్ ని జుర్రడంలో నా అంత స్పెషలిస్ట్ ఉండరని సమంత చెప్పుకొచ్చింది.
తమిళ వాసిగా సాంబర్ ని ఎక్కువగా ఇష్టపడుతానని.. అలాగే ఫిల్టర్ కాఫీ అన్న చాలా ఇష్టమని తెలిపింది. ఇక పరమాన్నం, సాంబర్ రైస్, బిర్యానీ లాంటివి కనిపిస్తే అస్సలు ఆపుకోలేను.. వాటిని ఓ పట్టు పట్టేస్తానని సమంత తెలిపింది. స్వీట్స్ లో డైరీ మిల్క్, పాలకోవా ఇష్టమని.. అయితే వాటిని చాలా లిమిట్ గా తీసుకుంటానని పేర్కొంది.