సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన `శాకుంతలం` విడుదలకు సిద్ధమైంది. కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో శకుంతలగా సమంత, దుష్యంత మహారాజుగా మలయాళ నటుడు దేవ్ మోహన్ నటించారు. మోహన్ బాబు, ప్రకాష్ రాజ్, మధుబాల, గౌతమి, అనన్య నాగళ్ల కీలక పాత్రలను పోషించారు.
గుణశేఖర్ రూపొందించిన ఈ అద్భుతమైన ప్రేమ కావ్యం ఏప్రిల్ 14న పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులను పలకరించబోతోంది. అయితే ఇటీవల విడుదలకు కొద్ది రోజుల ముందే ప్రీమియర్ షోలు వేసి సినిమా పై పాజిటివ్ బజ్ ఏర్పడేలా చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కంటెంట్ పై ఉన్న నమ్మకంతో నిన్నటి నుండి శాకుంతలం ప్రీమియర్ షోలు వేయడం మొదలుపెట్టారు.
కానీ, ఏదో అనుకుంటే ఇంకేదో అయింది. టాక్ బాగా వస్తుందనే నమ్మకం తో ఉన్న మేకర్స్ కు పెద్ద షాక్ తగిలింది. ‘శాకుంతలం’ ప్రీమియర్ షో చూసిన కొంతమంది సోషల్ మీడియా ద్వారా తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారు. అయితే ఈ ప్రీమియర్ షోకి మిక్స్డ్ టాక్ వస్తుండటం గమనార్హం. కొందరు సినిమా బాగుంది అంటుంటే.. మెజారీ ప్రేక్షకులు ఇదేం సినిమా అంటూ శాకుంతలంపై పెదవి విరిస్తున్నారు. గ్రాఫిక్స్ చాలా దరిద్రం గా ఉందని, స్క్రీన్ ప్లే కూడా ఏ మాత్రం బాగోలేదని అంటున్నారు. ఎన్నో క్లాసిక్ బ్లాక్ బస్టర్స్ తీసిన గుణ శేఖర్ నుండి ఇలాంటి సినిమా ఊహించలేదంటూ అభిప్రాయపడుతున్నారు.