ఆ పవన్ హీరోయిన్ ని బొక్కలో తోయ్యండి .. కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ..!!

ఎస్ ప్రెసెంట్ .. ఇదే న్యూస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కలిసి నటించిన అమీషా పటేల్ కి సంబంధించిన ఈ న్యూస్ బాలీవుడ్ మీడియాలో ఓ రేంజ్ లో ట్రెండ్ అవుతుంది . మనకు తెలిసిందే అమీషా పటేల్ బాలీవుడ్ లో ఎంతటి పెద్ద స్టార్ హీరోయిన్ అనేది. ఇప్పుడంటే అమ్మడు హవా కొనసాగట్లేదు కానీ .. అప్పట్లో అమ్ముడు పేరు చెప్తే కుర్రాళ్ళు గిలగిలా కొట్టుకునేవారు.

కేవలం బాలీవుడ్ లోనే కాదు టాలీవుడ్ లో కూడా సినిమాలో నటించి తనదైన స్టైల్ లో మెప్పించిన ఈ బ్యూటీ .. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కలిసి బద్రి అనే సినిమాలో నటించింది. రేణు దేశాయ్ – అమీషా పటేల్ హీరోయిన్లుగా నటించారు. చివరిలో డైరెక్టర్ పెట్టిన ట్వీస్ట్ సినిమాకి హైలెట్గా నిలిచింది . ఈ సినిమా ద్వారా తెలుగులో పాపులారిటీ సంపాదించుకున్న అమీషా ఇప్పటికి ఆ సినిమా పేరుతోనే తెలుగు ఇండస్ట్రీలో క్రేజ్ దక్కించుకుంటుంది .

రీసెంట్ గా ఆమ్మడు పేరు పై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది . చెక్ బౌన్స్ కేసు విషయంలో అమీషాపై కేసు నమోదు అయింది . తనను మోసం చేసిందని చెల్లని చెక్కులు ఇచ్చింది అంటూ రాంచికి చెందిన అజయ్ కుమార్ సింగ్ అనే వ్యక్తి ఆమెపై కేసు వేశాడు . ఈ క్రమంలోనే అమ్మడు ఎటువంటి రియాక్షన్ ఇవ్వకపోవడంతో అమీషా పటేల్ పై నెగిటివ్గా తీర్పు ఇచ్చింది కోర్టు. విచారణ జరిపిన న్యాయస్థానం అమీషా పటేల్ పై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది . ఈ క్రమంలోని ఏప్రిల్ 15 కు తదుపరి విచారణ వాయిదా వేశారు . ఆరోజు అమీషా పటేల్ వివరణ ఇవ్వకపోతే కచ్చితంగా అరెస్ట్ చేసే ఛాన్సెస్ ఎక్కువుగా ఉన్నాయి అంటున్నారు జనాలు. ఈ పేరు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..!!