లేచిపోయిన పూరి, ఛార్మి కౌర్.. ఎక్కడున్నారంటూ ఫ్యాన్స్ వెతుకులాట!

లైగర్ సినిమా అనూహ్య పరాజయం పాలైన తర్వాత పూరి జగన్నాథ్, ఆ సినిమా నిర్మాత చార్మి కౌర్ కనిపించకుండా పోయారు. బయటే కాదు సోషల్ మీడియాలోనూ వీరు కనిపించడం లేదు. దీంతో వీరు ఎక్కడికైనా లేచిపోయారా అంటూ నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.

దర్శకుడు పూరి జగన్నాథ్ గతంలో ఎన్నో హిట్స్ కొట్టాడు. ఎందరినో స్టార్ హీరోలుగా నిలబెట్టాడు. మొన్నీ మధ్య కూడా ఇస్మార్ట్ శంకర్ తో సంచలన విజయం సాధించాడు. అందుకే ఆయనకు సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ క్రియేట్ అయింది. కానీ లైగర్ తర్వాత అతనిపై చాలామంది విమర్శలు ఎక్కు పెట్టారు. అతని పని అయిపోయిందంటూ ఆత్మనున్యత భావానికి గురి చేసే కామెంట్లు కూడా చేశారు.

అయితే ఇతను పై ఒక ప్రధాన విమర్శ ఉంది. అది ఏంటంటే బాగా పేరు వచ్చి, ఆస్తి సంపాదించిన తర్వాత ఆ జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ పూరి జగన్నాథ్ తన కెరీర్ పై ఎక్కువ శ్రద్ధ పెట్టలేదు. దీని ఫలితంగానే అతని క్రియేటివిటీ మొత్తం సంక నాకి పోయింది. అర్జెంటుగా ఈ దర్శకుడు ఒక పాన్ ఇండియా లెవెల్ లో హిట్ కొడితే గానీ ఈ విమర్శలను చెరిపేసే అవకాశం లేదు.

లైగర్ వల్ల బయ్యర్లతో గొడవలు, ఈడీ విచారణలు ఇలా చాలా ఫేస్ చేయాల్సి వచ్చింది. వీటన్నిటిని అందరూ మర్చిపోయేలా చేయాలంటే అతని ఖాతాలో ఒక హిట్ పడాల్సిందే. కానీ పూరి ఇప్పుడు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఇక అతని ఫ్రెండ్, యాక్ట్రెస్, ప్రొడ్యూసర్ ఛార్మి కూడా కనిపించిన దాఖలాలు లేవు. ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా లేదు. నిజానికి పూరి జగన్నాథ్ ఒక నెల క్రితం వరకు మ్యూసింగ్స్ చేస్తూ అభిమానుల తో టచ్ లో ఉన్నాడు. కానీ ఆ తర్వాత అతను కూడా చార్మి లాగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. వీరిద్దరూ వారి జీవితంలో ఏం చేస్తున్నట్లు అని ఫ్యాన్స్ ఒకరికొకరు క్వశ్చన్ చేసుకుంటున్నారు.