యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. `ఎన్టీఆర్ 30` వర్కింగ్ టైటిల్ తో ఇటీవల ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లింది. ఇందులో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్ లో శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. ఇదిలా ఉంటే.. ఎన్టీఆర్ ఇంట్లో నిన్న నైట్ పార్టీ జరిగింది.
ఈ డిన్నర్ నైట్ కి రాజమౌళి, ఆయన తనయుడు కార్తికేయ, కొరటాల శివ, త్రివిక్రమ్ శ్రీనివాస్, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు నవీన్ యెర్నేని, రవి శంకర్ తో సహా తదితరులు హాజరు అయ్యారు. అమెజాన్ స్టూడియోస్ ప్రెసిడెంట్ జేమ్స్ ఫెర్రెల్ ఈ పార్టీకి హాజరు కావడం విశేషత సంతరించుకుంది. శ్రేయోభిలాషులు, సన్నిహితులతో గడిపిన ఈ క్షణాలు అద్భుతం అంటూ ఎన్టీఆర్ ట్విట్టర్ ద్వారా కొన్ని ఫోటోలు పంచుకున్నారు. ఇకపోతే ఈ నైట్ పార్టీలో అసలైన వ్యక్తి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మిస్ అవ్వడం హాట్ టాపిక్ గా మారింది. `ఆర్ఆర్ఆర్`కు ముందు నుంచి ఎన్టీఆర్, రామ్ చరణ్ బెస్ట్ ఫ్రెండ్స్.
ఆర్ఆర్ఆర్ తో వీరి బంధం మరింత బలపడింది. కానీ, గత కొద్ది రోజుల నుంచి వీరిద్దరి మధ్య విభేదాలు తలెత్తాయని జోరుగా వార్తలు వస్తున్నాయి. ఆస్కార్ గెలిచిన నేపథ్యంలో రామ్ చరణ్ తన బర్త్ డే గ్రాండ్ గా జరుపుకున్నారు. ఈ వేడకకు టాలీవుడ్ మొత్తం తరలివచ్చింది. కానీ, ఎన్టీఆర్ హైదరాబాద్ లో ఉండి కూడా డుమ్మా కొట్టాడు. ఇక ఇప్పుడు రామ్ చరణ్ కూడా అదే చేశాడు. భార్యతో మల్దీవ్స్ ట్రిప్ ముగించుకుని హైదరాబాద్ కు రామ్ చరణ్.. ఎన్టీఆర్ నివాసంలో జరిగిన నైట్ పార్టీకి హాజరు కాలేదు. దీంతో వీరి మధ్య విభేదాలు నిజమే అన్న అనుమానాలు మరింత పెరిగాయి.
https://twitter.com/tarak9999/status/1646218801577615365?s=20