కోలీవుడ్ హీరోయిన్గా స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకున్న నయనతార ఇక తెలుగు ప్రేక్షకులకు కూడా ఇమే బాగా సుపరిచితమే.. ఎన్నో చిత్రాలలో నటించిన ఈమె కోలీవుడ్ డైరెక్టర్ విగ్నేష్ ను ప్రేమించి వివాహం చేసుకుంది. అలాగే సరోగసి ద్వారా ఇద్దరు పిల్లలకు కూడా తల్లి అయింది. తాజాగా తమిళనాడు రాష్ట్రంలో ఉండే కామాక్షి అమ్మవారిని దర్శించుకునేందుకు తన కుటుంబ సమేతంగా వెళ్ళింది.. ఈ విషయం తెలుసుకున్న ప్రజలు చుట్టుపక్కల 10 గ్రామాలలోని ప్రజలు గంటల వ్యవధిలో అక్కడికి చేరుకోవడం జరిగింది.
నయనతార దంపతులు దైవదర్శనం తర్వాత బయటకు వస్తున్న సమయంలో ఒక గుర్తు తెలియని యువకుడు తన మొబైల్ కెమెరాలో నయనతార ఫోటోలను తీసేందుకు ప్రయత్నించారు.. ఫోటోలు మరియు వీడియోలను తీసేసి ప్రయత్నించారని దీంతో నయనతార అక్కడ తీవ్ర స్వరంతో షాక్ ఇచ్చింది ఫోన్లో ఫోటోలు లేదా వీడియోలను రికార్డు చేస్తే కచ్చితంగా మొబైల్ పగిలిపోతుంది అంటూ హెచ్చరిస్తోంది. ఈ సమయంలో వెంటనే అతడు అక్కడి నుంచి వెళ్లిపోయారు.. సాధారణంగా ఇలాంటి ప్రదేశాలకు వెళ్లిన సమయంలో నయనతార మీడియాకు దూరంగా ఉండాలని చూస్తూ ఉంటుంది.
దైవదర్శనానికి వెళ్లిన సమయంలో కూడా ఫోటోలు వీడియోలు తీయడం ఆమె తప్పు పట్టింది హీరోయిన్గా నయనతార ప్రస్తుతం సినిమాల విషయానికి వస్తే బాలీవుడ్ లో జవాన్ సినిమాలో నటిస్తోంది. ఈ చిత్రంలో చారుకు నటిస్తూ ఉన్నారు తమిళంలో రెండు సినిమాలలో కూడా నటిస్తున్నట్లు తెలుస్తోంది తెలుగులో ఒకటి రెండు సినిమాలలో చర్చ జరుపుతున్నట్లు తెలుస్తోంది ఎక్కువగా ఈమె లేడీ ఓరియంటెడ్ సినిమాలలోనే నటించడానికి మక్కువ చూపుతోంది.