తెలుగు సినీ ఇండస్ట్రీలో నటుడు శ్రీహరి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు.. ఈయన యాక్టింగ్ కూడా రియల్ గానే చేసినట్టే అనిపిస్తూ ఉంటుంది. శ్రీహరి కెరియర్ లో ఎటువంటి మచ్చ లేనటువంటి హీరోగా పేరు పొందారు. చాలా సినిమాలలో డూప్ లేకుండా నటించి మంచి విజయాలను అందుకున్నారు. ఎన్నో చిత్రాలలో కమెడియన్ గా హీరోగా విలన్ గా కూడా నటించారు. శ్రీహరి అకాల మరణం చెందడం వల్ల సినీ ఇండస్ట్రీకి తీరని శాపంగా మారింది.
ఇలాంటి శ్రీహరికి తాను మూడు నెలల క్రితమే మరణిస్తానని తెలుసని తాజాగా సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.. శ్రీహరి గారికి అనారోగ్య సమస్య ఉందని తాను చనిపోతానని ముందే తెలుసని భరద్వాజ్ తెలియజేశారు.. ఈ విషయం తెలుసుకున్న శ్రీహరి నెమ్మదిగా సినిమాలకు దూరంగానే ఉంటూ వచ్చారట.. శ్రీహరి గారు తెలుగులో సత్యమేవ జయతే వంటి షో చేయాలని అనుకున్నారటకాని ఆయన ఆరోగ్య పరిస్థితి బాగా లేకపోవడంతో ఆ షోకి నో చెప్పారట.
ఆయన స్టామినాకు మించి బాడీని కష్టపెట్టారని దీనివల్ల అనేక అనారోగ్య సమస్యలు మొదలయ్యాయని భరద్వాజ్ తెలిపారు. అయితే శ్రీహరి వంగవీటి రంగ ప్రోత్సాహం మల్లె సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. ఆ తర్వాత ఎక్కువగా దాసరి గారు అవకాశాలు ఇవ్వడంతో బాగా ఎదిగారని చెప్పవచ్చు. శ్రీహరి గారికి తన దగ్గరకు వచ్చిన దర్శక నిర్మాతలకు కచ్చితంగా అవకాశం ఇస్తారని తెలిపారు. ఇలాంటి పాత్రలోనైనా సరే శ్రీహరి ఒదిగిపోయిన నటిస్తూ ఉండేవారని చెప్పవచ్చు.. శ్రీహరి గారికి స్థారడం వచ్చినా కూడా చాలా సింప్లిసిటీ గా ఉండేవారు.