న్యాచురల్ స్టార్ నాని గత కొంత కాలం నుంచి సరైన హిట్ లేక చాలా సతమతం అవుతున్నాడు. తన తాజా చిత్రం `దసరా`తో బాక్సాఫీస్ వద్ద తన దాహాన్ని తీర్చుకోవాలని భావించాడు. నాని కెరీర్ లో తెరకెక్కిన తొలి పాన్ ఇండియా చిత్రమిది. కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఈ సినిమాను డైరెక్ట్ చేశాడు.
ఇందులో జాతీయ అవార్డు గ్రహీత కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది. విలేజ్ బ్యాక్డ్రాప్ లో సాగే రివేంజ్ డ్రామా ఇది. ఈ సినిమాతో సౌత్ తో పాటు నార్త్ లోనూ విధ్వంశం సృష్టించాలని నాని భావించాడు. కానీ, అనుకున్నది ఒకటి.. అయినది మరొకటి. నిజానికి దసరా నాని కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. వంద కోట్ల క్లబ్ లో చేరింది.
అయితే నానికి హిట్ కొట్టిన ఆనందమే లేదట పాపం. ఎందుకంటే, సౌత్ లో ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ గా నిలిచి మంచి లాభాలతో బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. కానీ, నార్త్లో మాత్రం బయ్యర్లకు భారీ నష్టాలు మిగిల్చేలా కనిపిస్తోంది. అక్కడ దసరా థియేట్రికల్ హక్కులను రూ. 4 కోట్లకు కొనుగోలు చేశారు. అయితే విడుదలై వారం అయినా రూ. 2 కోట్లు కూడా రాబట్టలేక అవస్థలు పడుతోంది. ఈ విషయంలోనే నాని ఫీల్ అవుతున్నాడని ఇన్సైడ్ టాక్ నడుస్తోంది.