న్యాచురల్ స్టార్ నాని రీసెంట్గా దసరా మూవీ తో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో శ్రీకాంత్ ఓదెల దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. ఇందులో జాతీయ అవార్డు గ్రహీత కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తే.. దీక్షిత్ శెట్టి కీలక పాత్రను పోషించాడు.
విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే రివేంజ్ డ్రామా ఇది. శ్రీరామనవమి కానుకగా మార్చి 30న పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ చిత్రం తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్ ను అందుకుంది. దీంతో బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే వసూళ్లను రాబడుతూ దుమ్ము దులుపుతోంది. విడుదలైన నాలుగు రోజులకే బ్రేక్ ఈవెన్ అయిన ఈ చిత్రం 100 కోట్ల క్లబ్లో కూడా చేరిపోయింది.
ఇక దసరా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో నాని తన రెమ్యునరేషన్ ను భారీ పెంచేశాడని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. ప్రస్తుతం ఒక్కో సినిమాకు ఈయన రూ. 20 కోట్ల రేంజ్ లో రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నాడట. ఇక దసరా ఫలితం దృష్ట్యా నిర్మాతలు సైతం నాని అడిగినంత ఇచ్చేందుకు నిర్మాతలు ఒకే చెబుతున్నారని తెలుస్తోంది. కాగా, నాని ప్రస్తుతం నూతన దర్శకుడు శౌర్యువ్ తో తన 30వ సినిమా చేస్తున్నాడు. ఇందులో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తోంది.