గత ఏడాది నుంచి బాదుడే బాదుడు, ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమాల్లో భాగంగా టిడిపి అధినేత చంద్రబాబు జిల్లాల పర్యటనకు వెళుతున్న విషయం తెలిసిందే. ప్రతి చోట మూడు నియోజకవర్గాల్లో బాబు రోడ్ షోలు, సభలు పెడుతున్నారు. ఈ సభలు భారీ స్థాయిలో సక్సెస్ అవుతున్నాయి. జనం పెద్ద ఎత్తున వస్తున్నారు.
ఇక చాలా రోజుల గ్యాప్ తర్వాత బాబు మళ్ళీ ఇదేం ఖర్మ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో బాబు పర్యటిస్తున్నారు. మచిలీపట్నం, గుడివాడ, నూజివీడు నియోజకవర్గాల్లో బాబు పర్యటిస్తున్నారు. మూడు చోట్ల రోడ్ షోలు, భారీ సభల్లో పాల్గొనున్నారు. అయితే ఈ నియోజకవర్గాలకు బాబు వచ్చి చాలా కాలమైంది. ఎన్నికల తర్వాత ఈ నియోజకవర్గాల్లో పర్యటించలేదనే చెప్పాలి. ఇప్పుడు బాబు పర్యటనతో టిడిపి శ్రేణుల్లో జోష్ నెలకొంది. బాబు పర్యటనకు భారీ స్థాయిలో టిడిపి శ్రేణులు రావడానికి సిద్ధమయ్యాయి.
అయితే బాబు టూర్ తో కృష్ణాలో టిడిపి తలరాత మారే ఛాన్స్ ఉంది. పైగా ఇప్పుడు పర్యటించే నియోజకవర్గాల్లో టిడిపి కాస్త వెనుకబడింది. గుడివాడలో టిడిపి ఇబ్బందుల్లో ఉంది. అక్కడ కొడాలి నాని హవా ఉన్న విషయం తెలిసిందే. ఇక ఆయన హవా తగ్గించేలా బాబు పర్యటన ఉండనుంది. ఈ టూర్ తో కాస్త పార్టీకి ఊపు రావచ్చు. అటు నూజివీడులో కూడా టిడిపి పరిస్తితి పెద్దగా బాగోలేదు. పైగా అక్కడ కూడా గ్రూపు తగాదాలు ఉన్నాయి. వాటిని సెట్ చేసే ఛాన్స్ ఉంది.
ఇటు మచిలీపట్నంలో పార్టీ పరిస్తితి కాస్త పర్లేదు.కానీ ఇపుడు బాబు టూర్ తో మరింత జోష్ వస్తుందనే చెప్పాలి. చూడాలి మరి బాబు టూర్ తో అయినా మూడు చోట్ల టిడిపి దశ తిరుగుతుందేమో.