బాలయ్య.. చంద్రబాబుల పై విరుచుకుపడ్డ లక్ష్మీపార్వతి..!!

నందమూరి కుటుంబంలో సీనియర్ ఎన్టీఆర్ రెండో భార్య గా లక్ష్మీపార్వతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ మధ్యకాలంలో ఈమె నందమూరి కుటుంబం పై పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేస్తూ ఉంటోంది. ఇప్పుడు తాజాగా బాలయ్య, లోకేష్ ల పైన ఎక్కువగా విమర్శలు చేస్తోంది. లక్ష్మీపార్వతి ప్రస్తుతం వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తోంది అనే వార్తలైతే వినిపిస్తున్నాయి. తాజాగా లక్ష్మీపార్వతి మాట్లాడుతూ బాలయ్య మాట్లాడితే ఎవరికైనా సరే ఆరు నెలల వరకు అర్థం కావని తెలియజేస్తోంది..

When Nara Lokesh Imitated Balayya!
ఇక బాలయ్య అల్లుడు లోకేష్ కూడా ఏమీ రాని దద్దమ్మ అంటూ సెటైర్లు వేసింది.. లోకేష్ పాదయాత్రలో రోజుకో విధంగా కామెడీ చేస్తున్నారని ఆమె అభిప్రాయంగా తెలుపుతోంది.. ఒక్కచోట కూడా గెలవని లోకేష్ జగన్ పైన విమర్శలు చేస్తుంటే టిడిపి పరిస్థితి ఎంత దిగజారిపోయిందో అర్థం చేసుకోవాలి అంటూ ఆమె ప్రశ్నిస్తోంది. లోకేష్ బూతులు తిట్టడమే పనిగా పెట్టుకున్నారని తమ ప్రభుత్వం వైఫల్యాలను లోకేష్ చెప్పకపోతున్నాడని లక్ష్మీపార్వతి వెల్లడించడం జరుగుతోంది. చంద్రబాబు చేసిన పాపాలు పండిపోయాయని చంద్రబాబు ఒక సైకో అని కూడా తెలియజేయడం జరుగుతుంది లక్ష్మీ పార్వతి.

Lakshmi Parvathi: TDP is on the verge of extinction: NTR's wife Lakshmi  Parvathi

లోకేష్ ను సోషల్ మీడియాలో ఒక పలికి మాలిన వెధవలుగా కుక్కలతో పోలుస్తున్నారని తెలుపుతోంది. బాలయ్య ఏం మాట్లాడతారు ఆయనకి అసలు అర్థం కావని లక్ష్మీపార్వతి తెలుపుతోంది చంద్రబాబు ₹5 లక్షల కోట్ల రూపాయలు స్విజర్లాండ్, దుబాయిలో దాచారని కూడా తెలుపుతోంది. ప్రస్తుతం లక్ష్మీపార్వతి చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి అవకాశం వచ్చిన ప్రతి సందర్భంలో కూడా ఈమె తీవ్రమైన స్థాయిలో విమర్శలు చేస్తూనే ఉంది. అయినప్పటికీ కూడా ఈమెను ఇంతవరకు నందమూరి కుటుంబం నుండి ఎవరు విమర్శించలేదు. కేవలం టిడిపి కార్యకర్తలు మాత్రమే అప్పుడప్పుడు విమర్శిస్తూ ఉంటారు.