ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. అడగకపోయినా సినీ, రాజకీయ ప్రముఖుల జాతకాలు చెబుతూ పాపులర్ అయ్యాడు. సమంత నాగచైతన్య పెళ్లి సమయంలోనే ఈ జంట విడిపోతుందంటూ జ్యోతిష్యం చెప్పాడు. నిజంగా అదే జరగడంతో వేణు స్వామిని చాలా మంది నమ్మడం మొదలుపెట్టారు.
సమంత-చైతన్య విడాకులు తర్వాత వేణు స్వామి మరింత ఫేమస్ అయిపోయాడు. పలువురు సినీ ప్రముఖులు ఆయన చేత పూజలు చేయించుకుంటున్నారు. ఆయన సలహాలు సూచనలు తీసుకుంటున్నారు. ఇదిలా ఉంటే.. వేణు స్వామి నిజస్వరూపం బట్టబయలు అయింది. సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన వేణు స్వామి సీక్రెట్ గా మాంసం తింటాడట. మద్యం కూడా సేవిస్తాడట. ఈ విషయం ఆయనే స్వయంగా బయటపెట్టాడు.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. `కొన్ని దేవాలయాల్లో దేవుడికి నైవేద్యంగా మద్యం, మాంసాన్ని పెడతారు. బ్రాహ్మణులు కూడా వాటిని తీసుకుంటున్నారు. అయితే నేను స్వచ్ఛమైన బ్రాహ్మణుల గురించి మాట్లాడడం లేదు. ఇక నేను కూడా రహస్యంగా మద్యం తీసుకుంటాను. మాంసం తింటాను. అందులో ఎలాంటి తప్పు లేదని నేను భావిస్తాను. నేను ఎక్కడికి వెళ్ళినా అక్కడి పరిస్థితిలకు తగ్గట్టుగా నా అభిరుచులను మార్చుకుంటాను` అంటూ షాకింగ్ విషయాలను రివీల్ చేశాడు. దీంతో వేణు స్వామి కామెంట్స్ కాస్త నెట్టింట వైరల్ గా మారాయి.