`ఉప్పెన` సినిమాతో బేబమ్మగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన అందాల భామ కృతి శెట్టి.. తొలి సినిమాతోనే సెన్సేషనల్ హిట్ ను ఖాతాలో వేసుకుంది. ఆపై కృతి శెట్టి నటించిన శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు చిత్రాలు కూడా హిట్ అవ్వడంతో కృతి శెట్టి క్రేజ్ అమాంతం పెరిగిపోయింది.
కానీ, ఆ తర్వాతే కృతి శెట్టి బ్యాడ్ టైమ్ మొదలైంది. అనూహ్యంగా వరుస ఫ్లాపుల్లో కూరుకుపోయింది. ఎంత త్వరగా క్రేజ్ సంపాదంచుకుందో.. అంతే త్వరగా కిందికి పడిపోయింది. ప్రస్తుతం నాగచైతన్యకు `కస్టడీ` అనే సినిమాలో నటించింది. త్వరలోనే ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కస్టడీతో ఖచ్చితంగా ఫామ్లోకి వస్తానని కృతి శెట్టి ఎంతో నమ్మకంగా ఉంది. ఇదిలా ఉంటే.. తమిళంలో కృతి శెట్టి ఓ కొత్త ప్రాజెక్ట్ కు సైన్ చేసింది. స్టార్ హీరో కార్తితో కృతి శెట్టి ఓ సినిమా కమిట్ అయింది. నలన్ కుమార్స్వామి ఈ సినిమాకు దర్శకుడు.
ఇందులో కృతి శెట్టితో పాటు గాయత్రి భరద్వాజ్ మరో హీరోయిన్ గా కనిపించబోతోంది. అయితే నిజానికి కార్తి అన్న సూర్యతో కలిసి బాల దర్శకత్వంలో కృతి శెట్టి ఈ సినిమా చేయాల్సి ఉంది. తమిళంలో తొలి సినిమానే సూర్యతో చేసే అవకాశం రావడంతో బేబమ్మ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కానీ, షూటింగ్ ప్రారంభం కావడానికి ముందే పలు కారణాల వల్ల సూర్య హీరోగా తప్పుకోవడంతో.. ఈ ప్రాజెక్ట్ ఆగిపోయింది. దాంతో సూర్యతో స్క్రీన్ షేర్ చేసుకోవాలన్న కోరికను బేబమ్మ ఇప్పుడు ఆయన తమ్ముడు కార్తితో తీర్చుకుంటుంది.