జ‌న‌సేన వ‌ర్సెస్ వైసీపీ స్టిక్క‌ర్ల వార్‌…!

`మా న‌మ్మ‌కం నువ్వే జ‌గ‌న్‌` పేరుతో వైసీపీ ప్ర‌భుత్వం వినూన్న కార్య‌క్ర‌మం చేప‌ట్టిన విష‌యం తెలిసిందే. ఈ కార్య‌క్ర‌మం ద్వారా.. మ‌రోసారి ఎమ్మెల్యేలు, మంత్రులు, పార్టీ ఇంచార్జులు, గృహ‌సార‌థుల‌ను ప్ర‌జ‌ల వ‌ద్ద‌కు పంపిస్తోంది. ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న ప‌థ‌కాల‌ను వివ‌రిస్తోంది. అదేస‌మ‌యంలో గ‌త చంద్ర బాబు ప్ర‌భుత్వం చేప‌ట్టిన కార్య‌క్ర‌మాలు.. మ‌ధ్య‌లోనే వ‌దిలేసిన కార్య‌క్ర‌మాలు.. వాటిని తాము ఎలా కొన‌సా గించామో.. కూడా.. వైసీపీ స‌ర్కారు వివ‌రిస్తోంది.

ఈ క్ర‌మంలోనే `మాన‌మ్మ‌కం నువ్వే జ‌గ‌న్‌` పేరుతో జ‌గ‌న్ ఫొటో ముద్రించిన స్టిక్క‌ర్‌ను ప్ర‌తి ఇంటి గోడ‌కు.. లేదా త‌లుపుల‌కు అంటిస్తున్నారు. మొత్తం 14 రోజుల పాటు ఈ కార్య‌క్ర‌మం రాష్ట్ర వ్యాప్తంగా.. ప‌ల్లెలు.. ప‌ట్ట‌ణాలు.. గ్రామాలు.. ఇలా.. అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల‌కూ చేరువ అయ్యేలా నిర్వ‌హిస్తున్నారు. అయితే.. ఈ కార్య‌క్ర‌మానికి కౌంట‌ర్‌గా ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ ఎలాంటి కార్య‌క్ర‌మాలు చేప‌ట్ట‌లేదు కానీ.. మ‌రో ప‌క్షం జ‌న‌సేన మాత్రం రివ‌ర్స్ కార్య‌క్ర‌మం చేప‌ట్టింది.

“మాకు న‌మ్మ‌కం లేదు జ‌గ‌న్‌.. మా న‌మ్మ‌కం ప‌వ‌నే“ పేరుతో జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు చిత్తూరు జిల్లాలో కార్య‌క్ర మానికి రెడీ అయ్యారు. వైసీపీ నేత‌లు వెళ్లి న ప్ర‌తి ఇంటికీ వారు కూడా వెళ్తున్నారు. వైసీపీ నేత‌లు అం టించిన స్టిక్క‌ర్ ప‌క్క‌నో.. లేదా.. కిందో తాము తీసుకువ‌చ్చిన స్టిక్క‌ర్‌ను అతికించి.. ఆ కుటుంబ స‌భ్యుల కు ప్ర‌భుత్వ ప‌థ‌కాల్లోని డొల్ల త‌నాన్ని వివ‌రిస్తున్నారు. అదేస‌మ‌యంలో వైసీపీ హ‌యాంలో చేసిన అప్పుల‌ను కూడా వివ‌రిస్తున్నారు.

చిత్తూరు జిల్లా జన‌సేన కీల‌క నాయ‌కుడు కిర‌ణ్ రాయ‌ల్ నేతృత్వంలో జిల్లా వ్యాప్తంగా జ‌న‌సేన నాయ‌కు లు ఈ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హిస్తుండ‌డంతో వైసీపీ నేత‌ల‌కు ఇప్పుడు ఏం చేయాల‌నేది స‌మ‌స్య‌గా మారిం ది. తామేదో వినూత్న కార్య‌క్ర‌మం చేప‌డుతుండ‌గా.. ఇప్పుడు ఇలా రివ‌ర్స్ కావ‌డం.. జ‌న‌సేన రంగంలోకి దిగ‌డం వంటివి చ‌ర్చ‌కు దారితీశాయి.