తెలుగు చిత్ర పరిశ్రమలో అపురూప సినిమాల్లో గుండమ్మ కథ కూడా ఒకటి. ఈ సినిమాలో తెలుగు దిగ్గజనుటలైన ఎన్టీఆర్, ఏఎన్నార్, ఎస్వీ రంగారావు, సావిత్రి, సూర్యకాంతం వంటి వారు ప్రధాన పాత్రలో నటించారు. ఈ సినిమా వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతున్నా.. ఇప్పటికీ ఈ సినిమా బుల్లితెర మీద వస్తే మిస్ అవ్వకుండా చూడని ప్రేక్షకులు లేరు. ఈ సినిమాను ఇప్పటి తరం హీరోలు రీమేక్ చేస్తున్నారని వస్తున్న వార్తల్లో నిజం లేదు.
ఇక గతంలో ఈ సినిమాలో నటించిన ఎన్టీఆర్, ఏఎన్నార్ నట వారసులైన బాలకృష్ణ, నాగార్జున కాంబోలో ఈ సినిమా మళ్లీ రాబోతుందని ప్రచారం కూడా జరిగింది. ఇక అది ఆ ప్రచారానికే పరిమితమైంది. ఆ తర్వాత ఈ కుటుంబాల నుంచి వచ్చిన మూడోతరం హీరోలైన నాగచైతన్య, జూనియర్ ఎన్టీఆర్ కాంబోలో కూడా ఈ సినిమా రాబోతుందని ప్రచారం కూడా జరిగింది. అయితే గుండమ్మ కథ సినిమాకు ప్రధాన పాత్ర అయినా సూర్యకాంతం రోల్ కు సరైన నటి దొరకపోవడంతో ఈ సినిమా ముందుకు వెళ్లలేదు.
అయితే ఇప్పుడు గుండమ్మ కథ సినిమాను ఆ రోజుల్లో విడుదల చేయడానికి ఆ సినిమా మేకర్స్ భయపడ్డారట అనే విషయం చాలామందికి తెలియదు. ఇక అందుకు గల కారణం కూడా లేకపోలేదు.. గుండమ్మ కథ సినిమాలో ఎన్టీఆర్ నిక్కర్ వేసుకుని నటించారన్న విషయం తెలిసిందే.. అయితే ఆ సమయానికే ఎన్టీఆర్ తెలుగులోనే అగ్ర హీరోగా ఎందరో అభిమానులను సంపాదించుకున్నారు. దాంతో ఎన్టీఆర్ను నిక్కర్లో చూస్తే ప్రేక్షకులు ఎలా ? రిసీవ్ చేసుకుంటారో అని చిత్ర యూనిట్ భయపడిందట.
అంతే కాకుండా ఈ సినిమా నిర్మాత మొదట సినిమాను తన ఇంట్లో జరిగిన ఓ ఫంక్షన్ లో వేసి వారి బంధువులకు చూపించారట. బంధువులు సినిమా చాలా బాగుందని చెప్పడంతో హమ్మయ్య అనుకుని థియేటర్ లో రీలిజ్ చేయడం జరిగింది. ఇక ఈ విషయాన్ని ప్రముఖరచయిత పరుచూరి గోపాలకృష్ణ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.