గత కొన్నేళ్లుగా విశాఖ రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు ఇప్పుడు ఊహించని తిప్పలు వచ్చాయి. ఆయనకు సైతం సీటు కోసం కష్టపడే పరిస్తితి వచ్చింది. ఆ పరిస్తితి ఆయన చేతులారా చేసుకున్నారనే చెప్పాలి. రాజకీయాలకు అనుగుణంగా ముందుకెళ్లడంతో గంటాకు ఇపుడు ఇబ్బందులు వచ్చాయి. అనేక మార్లు టిడిపిలో సత్తా చాటిన గంటా..గత ఎన్నికల్లో విశాఖ నార్త్ నుంచి గెలిచారు.
అయితే టిడిపి అధికారంలో లేకపోవడంతో గంటా సైలెంట్ అయ్యారు. అసలు పార్టీలో కనిపించలేదు..నియోజకవర్గంలో అడ్రెస్ లేరు..అంటే వైసీపీ వల్ల ఇబ్బందులు వస్తాయని సైడ్ అయ్యారు. అలాగే వైసీపీలోకి వెళ్లడానికి కూడా చూశారు. కానీ అందులోకి వెళ్లలేదు. అలా కొన్ని రోజుల పాటు సైలెంట్ గా ఉంటూ వచ్చిన గంటా..ఈ మధ్య టిడిపిలో ఫుల్ యాక్టివ్ అయ్యారు. ఇటీవలే చంద్రబాబు, లోకేష్లని కలిసొచ్చిన తర్వాత విశాఖలో దూకుడుగా పనిచేస్తున్నారు. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం గెలిపించడం కోసం బాగానే కష్టపడ్డారు.
అంతకముందు వరకు వైసీపీపై విమర్శలు చేయని ఆయన..ఇప్పుడు వైసీపీని గట్టిగా టార్గెట్ చేసి విమర్శలు చేస్తున్నారు. అలాగే చంద్రబాబుపై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా బాబు పుట్టిన రోజు వేడుకలని ఘనంగా నిర్వహించారు. అలాగే మళ్ళీ రాష్ట్రం బాగుపదాలంటే మా అన్న చంద్రబాబు రావాల్సిందే అని పోస్టులు పెట్టారు. దీని బట్టి చూస్తే బాబుకు గంటా భజన చేస్తున్నారని అర్ధమవుతుంది.
ఇదంతా సీటు కోసమే అని తెలుస్తోంది. ఇప్పటికే ఆయనకు సీటు విషయం లో క్లారిటీ లేదు. మళ్ళీ విశాఖ నార్త్ లో పోటీ చేయాలంటే అక్కడ ప్రజలు గంటాకు అనుకూలంగా లేరు..కాబట్టి గెలిచే సీటు దక్కించుకోవడం కోసం గంటా నానా పాట్లు పడుతున్నారు.