వాల్తేరు వీరయ్యతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకని మంచి కమ్బ్యాక్ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి.. ప్రస్తుతం మెహర్ రమేష్ దర్శకత్వంలో `భోళా శంకర్` అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తమిళ సూపర్ హిట్ `వేదాళం`కు రీమేక్ ఇది.
ఇందులో చిరంజీవికి జోడీగా మిల్కీ బ్యూటీ తమన్నా.. సోదరి పాత్రలో కీర్తి సురేష్ నటిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం ఆగస్టు 11న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఇకపోతే ఈ సినిమా తర్వాత చిరంజీవి నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏ డైరెక్టర్ తో ఉండబోతోంది అనేది ఆసక్తికరంగా మారింది. ఇలాంటి తరుణంలో ఎవరు ఊహించిన డైరెక్టర్ పేరుకి వచ్చింది.
అతడే మల్లిడి వశిష్ట. బింబిసార మూవీతో గత ఏడాది టాలీవుడ్ కు పరిచయమైన ఈయన.. తొలి సినిమా తోనే సెన్సేషన్ క్రియేట్ చేశాడు. అయితే చిరంజీవి నెక్స్ట్ ప్రాజెక్ట్ వశిష్టతో ఉండబోతోందట. ఇప్పటికే వశిష్ట ఓ అదిరిపోయే కథ చెప్పి మెగాస్టార్ ను మెప్పించాడట. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కబోతోందని.. హై బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారని ప్రచారం జరుగుతుంది. దీంతో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయిపోతున్నారు. వీరి కాంబో ప్రాజెక్ట్ బాక్సులు బద్దలు కొట్టడం ఖాయమంటూ చెబుతున్నారు.