బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ గురించి పరిచయాలు అవసరం లేదు. బడా సినీ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినప్పటికీ.. తనదైన టాలెంట్ తో తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్ గా ముద్ర వేయించుకుంది. గత ఏడాది `ఆర్ఆర్ఆర్`తో సౌత్ ఇండస్ట్రీలోకి కూడా అడుగు పెట్టింది.
దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన ఈ చిత్రం సంచలన విజయాన్ని నమోదు చేయడంతో.. అలియా సౌత్ ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. ఇకపోతే ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న అలియా భట్.. తాజాగా ఓ కొత్త ఇంటిని కోనుగోలు చేసింది.
అయితే ఇది రణ్భీర్తో తాను కలిసి ఉండటానికి మాత్రం కాదని, తన ప్రొడక్షన్ హౌస్ కోసం అని బాలీవుడ్ మీడియా టాక్. ఇప్పటి వరకు హీరోయిన్గా సినిమాలు చేస్తున్న ఆమె ఇప్పుడు నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టాలనుకుంటుంది. అందుకోసమే ఈ ప్రొడెక్షన్ హౌస్ పేరిట ముంబైలో ఓ ఇంటిని కొనుగోలు చేసిందట. ఈ ఇంటి ఖరీదు తెలిస్తే కళ్లు తేలేస్తారు. ఎందుకంటే, రూ. 38 కోట్లు ఖర్చు పెట్టి అలియా ఈ ఇంటిని దక్కించుకుందట. ఇక ఈ ఇంటి కోసం అలియా రూ.2.25 కోట్లు ట్యాక్స్ను కట్టిందని సమాచారం.