ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన `పుష్ప` చిత్రం ఎంతటి సంచలన విజయాన్ని నమోదు చేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సినిమాలో రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించింది. మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్ విలన్ గా చేశాడు. 2021 డిసెంబర్ 17న విడుదలైన ఈ చిత్రం.. పాన్ ఇండియా స్థాయిలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
ప్రస్తుతం ఈ సినిమాకు కొనసాగింపుగా పుష్ప 2 తెరకెక్కుతోంది. ఇటీవల సెట్స్ మీదకు వెళ్ళిన ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. అయితే ఈ సినిమాలో ఒక పాత్రలో న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి నటించబోతుందని గత కొద్దిరోజుల నుంచి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే.
అయితే ఈ విషయంపై తాజాగా సాయి పల్లవి ఓపెన్ అయింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సాయి పల్లవి.. తాను పుష్ప సెకండ్ పార్టులో నటించడం లేదని క్లారిటీ ఇచ్చింది. అయితే ఆ సినిమాలో ఉన్నానని అన్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానని పేర్కొంది. కానీ, నెట్టింట జరుగుతున్న ప్రచారం అవాస్తవం అని తేల్చేసింది. దీంతో సాయి పల్లవి అభిమానులు ఎంతగానో ఫీల్ అవుతున్నారు.