నివేదా పేతురాజ్.. ఈ ముద్దుగుమ్మ గురించి పరిచయాలు అవసరం లేదు. మెంటల్ మదిలో మూవీతో తెలుగు తెరకు పరిచయం అయిన ఈ భామ.. ఇప్పటి వరకు చేసింది తక్కువ సినిమాలే అయినా నటిగా మంచి గుర్తింపు సంపాదించుకుంది. తాజాగా `దాస్ కా ధమ్కీ` మూవీతో ప్రేక్షకులను పలకరించింది. విశ్వక్ సేన్ హీరోగా నటించి, దర్శకత్వం వహించి, నిర్మించిన చిత్రమిది.
ఉగాది పండుగ కానుకగా మార్చి 22న విడుదలైన ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ లభించింది. కానీ, బాక్సాఫీస్ వద్ద ధమ్కీ కలెక్షన్ల పరంగా దుమ్ము దుమారం రేపుతోంది. తొలి రోజే సగం టార్గెట్ ను రీచ్ అయిన ఈ చిత్రం.. రెండో రోజు కూడా అదరగొట్టేసింది. ఇకపోతే ఈ మూవీలో హీరోయిన్ గా నటించిన నివేదా.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకుంది.
ప్రస్తుతం పలు బిజినెస్ లతో బిజీగా ఉన్నానని.. అందుకే ఎక్కువగా సినిమాలు చేయడం లేదని నివేదా పేర్కొంది. అలాగే బాలీవుడ్ నిర్మాత సంస్థ టీ సిరీస్ బ్యానర్ లో ఈ మూవీకి కమిట్ అయ్యాయని.. ఈ క్రమంలోనే ముంబైలో ఇల్లు కొనుగోలు చేశానని తెలిపింది. త్వరలోనే ముంబైకి మకాం మారుస్తున్నానని వెల్లడించింది. దీంతో నివేదా యవ్వారం మామూలుగా లేదు.. బాలీవుడ్ లో ఒక్క ఆఫర్కే ముంబైలో ఇల్లు కొనేసిందా..? అంటూ నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. మొత్తానికి నివేత ముంబైలో ఇల్లు కొన్న వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.