టాలీవుడ్ లో ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు మృణాల్ ఠాకూర్. ఈమె తెలుగులో సీతారామం సినిమాతో ఎంతో గుర్తింపు తెచ్చుకుంది. అందులో సీత అనే పాత్రలో ఎంతగానో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమాకి హను రాఘవపూడి దర్శకత్వం వహించారు. ఇందులో దుల్కర్ సల్మాన్ హీరోగా నటించారు. మృణాల్ మొదటగా బాలీవుడ్లో సీరియల్స్ తో ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత అక్కడ హీరోయిన్స్ గా ఛాన్సులు అందుకుంది. షాహిద్ కపూర్ హీరోగా నటించిన జెర్సీ సినిమాతో మంచి విజయం అందుకుంది.
అంతేకాకుండా ఈ అమ్మడు చిన్న చిన్న యాడ్స్ లో కూడా నటిస్తోంది. అయితే సీతారామం సక్సెస్ అయిన తర్వాత ఈమెకి చాల అవకాశాలు వస్తున్నాయి. అయితే తెలుగులో నాచురల్ స్టార్ సరసన నటించబోతోంది. నాని కెరియర్ లో ఇది 30వ సినిమా అందులో మృణాల్ నీ ఎంపిక చేయడం జరిగింది.ఇప్పటికే ఈ సినిమా అనౌన్స్మెంట్ ఈ సినిమాకు మంచి బజ్ నూ ఏర్పడుతోంది.
ఇదిలా ఉంటే తాజాగా ఒక వేదికపై మృణాల్ మాట్లాడుతూ కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. ముందుగా తాను సినిమాల్లో నటించడం తన పేరెంట్స్ కి ఇష్టం లేదని మాది మరాఠీ ఫ్యామిలీ… నేను సినిమా రంగంలోకి రావడానికి మా కుటుంబం ఇష్టపడలేదని..ఎందుకంటే మా తల్లిదండ్రులకు సినిమా రంగం గురించి తెలియదు. అందువల్లే వాళ్ళు నాకు సపోర్టు చేయలేకపోతున్నారు. కానీ నేను నటిగా నిరూపించాను. చాలామంది నన్ను స్మితా పాటిల్ తో పోలుస్తున్నారు. నాకు ఎంతో గర్వంగా ఉంది అలా అన్నప్పుడల్లా ఇప్పుడు నా పేరెంట్స్ కి సినిమా రంగం అంటే ఏమిటో తెలుసు కాబట్టి నన్ను ఇప్పుడు ప్రోత్సహిస్తూ ముందుకు నడిపిస్తున్నారు. అంటూ హ్యాపీగా చెప్పుకొచ్చింది మృణాల్ ఠాగూర్..