మ‌హేష్‌-త్రివిక్ర‌మ్ మూవీ టైటిల్ లాక్‌.. ఇదేదో ప‌థ‌కం పేరులా ఉందే!?

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో `SSMB 28` వ‌ర్కింగ్ టైటిల్ తో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అతడు, ఖలేజ చిత్రాల‌ తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న హ్యాట్రిక్ మూవీ ఇది. ఇందులో టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే, యంగ్ బ్యూటీ శ్రీ‌లీల‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై సూర్యదేవర రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కొద్దిరోజుల క్రితమే సెట్స్‌ మీదకు వెళ్ళిన ఈ చిత్రం శ‌ర‌వేగంగా షూటింగ్‌ జరుపుకుంటుంది. ఆగ‌ష్టు 11న ఈ చిత్రాన్ని విడుదల చేయ‌బోతున్న‌ట్లు ఇప్ప‌టికే మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. ఈ నేప‌థ్యంలోనే త్వ‌ర‌త్వ‌ర‌గా చిత్రీక‌ర‌ణ పూర్తి చేసే ప‌నిలో ఉన్నారు మేక‌ర్స్‌.

ఇక‌పోతే ఈ మూవీకి తాజాగా టైటిల్ లాక్ చేశార‌ట‌. అందుతున్న స‌మాచారం ప్ర‌కారం.. ‘అమ్మఒడి’ అనే టైటిల్‌ను ఈ చిత్రానికి త్రివిక్రమ్ ఫిక్స్ చేసినట్టు సమాచారం. సినిమా మొత్తం పూర్తిగా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ తో కూడుకున్నది కాబట్టి, కథ కి తగ్గట్టుగా ఈ టైటిల్ ని లాక్‌ చేసినట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. దీంతో ఇదేదో ప‌థ‌కం పేరులా ఉందే అంటూ నెటిజ‌న్లు సెటైర్లు పేలుస్తున్నారు. కాగా, ’అమ్మఒడి’ అనేది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రవేశ పెట్టిన ముఖ్యమైన పథకాలలో ఒకటి అన్న సంగ‌తి తెలిసిందే.