ఇండియా వచ్చినా హైదరబాద్ రాని చరణ్..కారణం అదేనా..? మెగా అభిమానులకి కొత్త డౌట్లు..!?

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా పవర్ స్టార్ గా పేరు సంపాదించుకున్న రాంచరణ్.. ప్రెసెంట్ తన పేరుని ఎలా ప్రపంచవ్యాప్తంగా మారుమ్రోగిపోయే చేసుకున్నాడో మనందరికీ బాగా తెలుసు . ఆయన లాస్ట్ గా నటించిన సినిమా ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అవార్డుని అందుకుంది . ఒరిజినల్ సాంగ్ విభాగంలో భాగంగా ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటునాతు పాటకు ఆస్కార్ అవార్డు లభించింది . ఇండియన్ ఫిలిం హిస్టరిలోనే ఆరారార్ కి ఆ ఘనత దక్కింది .

ఈ క్రమంలోని అమెరికాలో ఫుల్ సందడి చేసిన ఆర్ఆరార్ టీం ఎట్టకేలకు ఇండియాకి తిరిగి వచ్చింది. అయితే ఆర్ఆరార్ టీం మొత్తం హైదరాబాద్ చేరుకున్నా.. రాంచరణ్ ఢిల్లీలోనే ఆగిపోయారు . దానికి మెయిన్ రీజన్ ఇండియా టుడే కాన్ క్లేవ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ను ఆహ్వానించడమే. ఈ ప్రతిష్టాత్మకమైన ఈవెంట్ లో ప్రధాని మోడీ హాజరు కాబోతున్నారు. సచిన్ కూడా ఈవెంట్ కి అటెండ్ అయ్యాడు.

ఆస్కార్ అవార్డ్ సాధించిన తర్వాత ఇండియాకు తిరిగి వచ్చిన చరణ్ ..అప్పుడే ఈవెంట్స్ లో బిజీగా మారిపోయారు . ఈ కారణంగానే ఢిల్లీలోనే ఆగిపోయారు చరణ్ అని.. హైదరాబాద్ కు తిరిగి రాలేదు అంటూ తెలుస్తుంది. హైదరాబాద్ లో గిగగానే ఆయనకు ఘన స్వాగతానికి ఏర్పాట్లు చేస్తుంది మెగా ఫ్యామిలి. అంతే కాదు మెగా అభిమానులు స్పెషల్ సర్ప్రైజ్ పార్టీలు కూడా రెడీ చేసినట్లు తెలుస్తుంది.
ఏదిఏమైనా ఒకే ఒక అవార్డుతో తన పేరుని ప్రపంచవ్యాప్తంగా మారుమ్రోగిపోయేలా చేసుకున్నాడు ఈ మెగావారసుడు..!!