చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో వచ్చిన ఐతే సినిమాతో హీరోయిన్గా పరిచయమైన ముద్దుగుమ్మ సింధుతులాని. ఈ సినిమా తర్వాత కళ్యాణ్ రామ్కు జంటగా అతనొక్కడే సినిమాలో నటించింది. ఈ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. ఆ తర్వాత గౌతమ్ ఎస్ఎస్సీ, పౌర్ణమి, పోతే పోనీ, హరే రామ్ వంటి సినిమాలలో నటించింది.
ఈ ముద్దుగుమ్మ తెలుగులోనే కాకుండా తమిళం, కన్నడ, హిందీ భాషల్లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. మరి ముఖ్యంగా తమిళంలో శింబు హీరోగా వచ్చిన మన్మధ సినిమాతో భారీ హిట్ను తన ఖాతాలో వేసుకుని అందరి దృష్టిని తన వైపు తిప్పుకుంది. ఆ సమయంలో స్టార్ హీరోయిన్ హోదాను మాత్రం దక్కించుకోలేకపోయింది. అందం, అభినయం నటనా ప్రతిభతో సినీ విమర్శకుల నుంచి ఎన్నో ప్రశంసలు కూడా అందుకుంది. హీరోయిన్గా అవకాశాలు తగ్గిన తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాలలో నటించింది.
తెలుగులో కిక్, ప్రేమ కావాలి, ఇష్క్ వంటి సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించింది. అదేవిధంగా త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో బన్నీకి వదినగా నటించి తన నటనతో అందరినీ ఆకట్టుకుంది. ఈ సినిమా తర్వాత సింధు చివరిగా నటించిన మూవీ చిత్రాంగద అంజలి ముఖ్యపాత్రలో లేడీ ఓరియెంటెడ్ సినిమా ఇది. ఈ సినిమా తర్వాత సింధు వెండితెరపై కనిపించలేదు.
సినిమాలకు దూరమైన సింధు తర్వాత చేతన్ అనే అబ్బాయిని వివాహం చేసుకుంది. సింధు భర్త సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అని తెలుస్తుంది. ఈ దంపతులకు శ్వేతా అనే ఓ పాప కూడా ఉంది. ప్రస్తుతం ఈ జంట ముంబైలో నివసిస్తున్నట్లు సమాచారం. వివాహం తర్వాత సినిమాలకు దూరమైన సింధు.. ఇంటి వద్దనే ఉంటూ తన కుటుంబ బాగోగులు చూసుకుంటుంది.