మలయాళ సినీనిర్మాత సురేష్ కుమార్, మలయాళ నటి మేనక కుమార్తె అయిన కీర్తి సురేష్.. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించింది. ఆ తర్వాత హీరోయిన్ గా మారి.. తక్కువ సమయంలోనే సౌత్ లో స్టార్ హీరోయిన్ గా ముద్ర వేయించుకుంది. ‘మహానటి’ సినిమాతో ఏకంగా నేషనల్ అవార్డును అందుకుంది. కెరీర్ ఆరంభం నుంచి నటనకు ఉన్న పాత్రలనే ఎంచుకుంటూ ప్రేక్షకులను మెప్పిస్తోంది.
ఈ క్రమంలోనే భారీగా సంపాదిస్తోంది కూడా. ఈ మలయాళ ముద్దుగుమ్మ ఓవైపు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూనే.. మరోవైపు పలు బ్రాండ్స్ కు ప్రచారకర్తగా వ్యవహరిస్తోంది. అలాగే తన స్నేహితులతో కలిసి పలు వ్యాపారాలు సైతం చేస్తోంది. మొత్తంగా ఏడాదికి ఈ బ్యూటీ పది నుంచి పన్నెండు కోట్లు సంపాదిస్తోంది. ఇక కీర్తి సురేష్ పేరిట ఎన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు.
ఆమె ఆస్తుల విలువ మొత్తం లెక్కగడితే 120 కోట్ల రూపాయలకు పైగానే ఉన్నట్టు తెలుస్తుంది. ఇదంతా కేవలం కీర్తి సురేష్ సంపాదనే అట. అలాగే కీర్తి సురేష్ కోసం ఆమె తల్లిదండ్రులు కూడా గట్టిగానే ఆస్తులు కూడబెడుతున్నారు. ఏదేమైనా ఆస్తుల విషయంలో కీర్తి సురేష్ ముందు పలువురు స్టార్ హీరోలు కూడా దిగదుడుపే అని అంటున్నారు. కాగా, కీర్తి సురేష్ త్వరలోనే `దసరా` మూవీతో ప్రేక్షకులను పలకరించబోతోంది. నాని ఇందులో హీరోగా నటించారు. మార్చి 30న ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది.