ఊరించి ఊసూరుమ‌నిపించారు క‌ద‌రా.. మ‌హేష్ ఫ్యాన్స్ ల‌బోదిబో!

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అతడు, ఖలేజా చిత్రాల తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న హ్యాట్రిక్‌ మూవీ ఇది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై సూర్యదేవర రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో పూజా హెగ్డే, శ్రీ‌లీల హీరోయిన్లుగా నటిస్తున్నారు.

కొద్దిరోజుల క్రితమే సెట్స్‌ మీదకు వెళ్ళిన ఈ చిత్రం.. ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా షూటింగ్‌ జరుపుకుంటుంది. ఆగ‌స్టులు ఈ మూవీ విడుద‌ల ఉంటుంద‌ని ఆల్రెడీ అనౌన్స్ చేశారు. అయితే ఉగాది పండుగ కానుక‌గా ఈ సినిమా టైటిల్ అనౌన్స్మెంట్ మ‌రియు మ‌హేష్ ఫ‌స్ట్ లుక్ బ‌ట‌య‌కు వ‌స్తుంద‌ని గత కొద్దిరోజుల నుంచి జోరుగా ప్రచారం జరుగుతుంది. తాజాగా ఈ విషయంపై చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చింది.

`మహేష్ మూవీ అప్డేట్ కోసం మీరు ఎంతగా ఎదురుచూస్తున్నారో మాకు తెలుస్తుంది. అయితే సమయం వచ్చినప్పుడు మేము ఖచ్చితంగా అదిరిపోయే అప్డేట్ ఇస్తాము.. అప్ప‌టి వ‌ర‌కు వేచి ఉండండి` అంటూ ట్వీట్ చేసింది. ఉగాదికి ఎలాంటి అప్డేట్ లేదని చెప్పకనే చెప్పారు. దీంతో మహేష్ ఫ్యాన్స్ బాగా హర్ట్ అయ్యారు. ఊరించి ఊరించి ఊసూరుమ‌నిపించారు క‌ద‌రా అంటూ మ‌హేష్ ఫ్యాన్స్ ల‌బోదిబో మంటున్నారు. క‌నీసం వ‌చ్చే వారంలో శ్రీ‌రామ న‌వ‌మికి అయినా అప్డేట్ ఇవ్వ‌మంటూ కామెంట్లు చేస్తున్నారు.