న్యాచురల్ స్టార్ నాని ఎన్నో ఆశలు పెట్టుకుని చేసిన తాజా చిత్రం `దసరా`. ఇందులో జాతీయ అవార్డు గ్రహీత కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది. `నేను లోకల్` సినిమాలో క్యూట్ లవర్స్గా ఆకట్టుకున్న నాని- కీర్తి, దసరా సినిమాలో మాత్రం పూర్తి రస్టిక్ క్యారెక్టర్స్లో కనిపించనున్నారు. ఈ సినిమాతో శ్రీకాంత్ ఓదెల దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు.
శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ చత్రంలో సముద్రఖని, సాయి కుమార్, షైన్ టామ్ చాకో తదితరులు కీలక పాత్రలను పోషించారు. గోదావరిఖని ప్రాంతంలోని సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో పక్కా మాస్ యాక్షన్ మూవీగా రూపుదిద్దుకున్న ఈ చిత్రం మార్చి 30న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలోనే చిత్ర టీమ్ తో కలిసి నాని, కీర్తి సురేష్ దసరాను గట్టిగా ప్రమోట్ చేస్తున్నారు.
దీంతో ఈ మూవీకి భారీ స్థాయిలో బిజినెస్ జరుగుతోంది. తాజాగా దసరా ఓవర్సీస్ రైట్స్ కళ్లు చెదిరే ధర పలికాయి. ఓవర్సీస్ లో డిస్ట్రిబ్యూట్ చేసే ప్రముఖ ప్రొడక్షన్ హౌస్ ఏకంగా రూ. 6 కోట్లు పెట్టి దసరా థియేట్రికల్ రైట్స్ ని దక్కించుకున్నట్లుగా తెలుస్తోంది. నాని ఇమేజ్ పరంగా చూసుకుంటే ఓవర్సీస్ లో దసరా సినిమాకి రూ. 6 కోట్లు వెచ్చించారు అంటే మామూలు విషయం కాదు. ఆయన కెరీర్ లో హైయ్యెస్ట్ ఓవర్సీస్ బిజినెస్ అనే చెప్పాలి. మరి ఈ సినిమా విడుదల తర్వాత ఎలాంటి వసూళ్లను రాబడుతుందో చూడాలి.