కోలీవుడ్ స్టార్ కపుల్స్లో అజిత్- షాలిని కూడా ఒకరు. అయితే ఇప్పుడు గత కొద్దిరోజులుగా ఈ స్టార్ కపుల్స్ పై షాకింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 22 ఏళ్ల అజిత్- షాలినిల దాంపత్య జీవితంలో కొంతకాలంగా మనస్పర్ధలు వచ్చాయని, త్వరలోనే ఈ జంట విడాకులు తీసుకోబోతున్నారు అంటూ కోలీవుడ్ మీడియాలో పలు కథనాలు ఎంతో చర్చనీయాంశంగా మారాయి. దీంతో ఈ అందమైన జంట విడిపోవడం ఏంటని వారి అభిమానులు ఒకసారిగా షాక్ అయ్యారు.
సోషల్ మీడియాలో కూడా జోరుగా ఈ ఫేక్ న్యూస్ వినిపిస్తున్న సమయంలో అజిత్- షాలినిలు ఆ వార్తలకు చెక్ పెట్టేందుకు డిసైడ్ అయినట్టు తెలుస్తుంది. అందులో భాగంగా రీసెంట్గా అజిత్ తో ఉన్న వరుస ఫోటోలను షాలిని తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వచ్చింది. ఇప్పుడు తాజాగా ఓ వెకేషన్ కు సంబంధించి తన భర్తతో కలిసి ఉన్న ఓ రొమాంటిక్ పిక్ను సోషల్ మీడియాలో షేర్ చేసి పరోక్షంగా తనపై వస్తున్న వార్తలపై స్పందించింది.
దీంతో ఇప్పుడు సోషల్ మీడియాలో వస్తున్న అజిత్- షాలిని విడాకుల వార్తల్లో నిజం లేదని తేలిపోయింది. కాగా ఇక సినిమాల విషయానికి వస్తే.. ఈ ఏడాది అజిత్ ‘తునీవు'(తెగింపు) చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.
View this post on Instagram