నటుడు శరత్ బాబు కు చికిత్స.. అసలు విషయం ఏమిటంటే..?

తెలుగు చిత్రా పరిశ్రమలో ప్రముఖ నటుడు శరత్ బాబు హీరోగా ,క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో వందల చిత్రాలలో నటించారు. శరత్ బాబు వయసు ఇప్పుడు 70 సంవత్సరాలు దాటుతున్న ఇంకా పలు చిత్రాలలో నటిస్తూనే ఉన్నారు. తాజాగా నటుడు శరత్ బాబు అనారోగ్యానికి గురైనట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో చికిత్స కోసం చెన్నైలో ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చేరినట్లు సమాచారం. అయితే శరత్ బాబు అనారోగ్య సమస్య ఏంటనే విషయం ఇప్పటివరకు బయటకు రాలేదు.

శరత్ బాబు ఆస్పత్రిలో చేరారని విషయం కొంతమంది అభిమానులకు తెలియగానే కాస్త నిరుత్సాహ పడుతున్నారు. కొంతమంది ప్రముఖులు ఆయనను పరామర్శించేందుకు ఆసుపత్రికి వెళుతున్నట్లు సమాచారం. దీంతో అభిమానులు శరత్ బాబు త్వరగా కోలుకోవాలని పోస్ట్ చేస్తున్నారు. శరత్ బాబు 1973లో నటుడుగా రామరాజ్యం అనే సినిమాతో మొదటిసారిగా తన సినీ కెరియర్ ప్రారంభించారు.


తనకేరియర్ లో మూడుముళ్ల బంధం, సీతాకోకచిలుక, సంసారం ఒక చదరంగం, ఆపద్బాంధవుడు తదితర ఎన్నో అద్భుతమైన చిత్రాలలో నటించారు. శరత్ బాబు మూడు నంది అవార్డులను కూడా గెలుచుకున్నారు. శరత్ బాబు, రమప్రభ ప్రేమించుకొని వివాహం చేసుకున్నారు.. కానీ కొన్ని కారణాల చేత వీరిద్దరూ విడిపోవడం జరిగింది.శరత్ బాబు చివరిసారిగా వకీల్ సాబ్ సినిమాలో నటించారు. టాలీవుడ్ నటి కరాటే కళ్యాణి కూడా శరత్ బాబు త్వరగా కోలుకోవాలని ఒక పోస్ట్ ని షేర్ చేసింది తనకి ఇష్టమైన హీరోలలో శరత్ బాబు కూడా ఒకరిని ఆయన త్వరగా కోలుకోవాలని స్వామివారిని వేడుకుంటున్నాను అంటూ ఒక పోస్ట్ ని షేర్ చేసింది.