ఈ ఏడాదిని మెగాస్టార్ చిరంజీవి ఎంతో ఘనంగా ప్రారంభించారు. సంక్రాంతి పండుగ కానుకగా చిరంజీవి నటించిన `వాల్తేరు వీరయ్య` సినిమా విడుదలైన సంగతి తెలిసిందే. బాబీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మాస్ మహారాజా రవితేజ కీలకపాత్రను పోషించాడు. శృతిహాసన్, కేథరిన్ హీరోయిన్లుగా నటించారు.
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రం జనవరి 13న విడుదలై బ్లాక్ పాస్టర్ హిట్గా నిలిచింది. నిజానికి ఈ సినిమాకు తొలిరోజు మిక్స్డ్టాక్ వచ్చింది. కానీ వసూళ్ల పరంగా మాత్రం దుమ్ము దులిపేసింది. గత కొంత కాలం నుంచి వరుస ఫ్లాపులతో సతమతం అవుతున్న చిరంజీవి.. ఈ సినిమాతో బిగ్గెస్ట్ హిట్ అందుకుని మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కారు.
‘వాల్తేరు వీరయ్య’తో మెగా అభిమానుల ఆకలి తీరిపోయింది. అయితే తాజాగా ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది నెట్ ఫ్లిక్స్. వాల్తేరు వీరయ్య డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ను సాలిడ్ ధరకు దక్కించుకున్న నెట్ ఫ్లిక్స్.. ఫిబ్రవరి 27నుండి ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు తాజాగా ప్రకటించింది. ఈ అప్డేట్ తో మెగా ఫ్యాన్స్ మళ్లీ వాల్తేరు వీరయ్యను ఓటీటీలో చూడొచ్చని ఫుల్ ఖుషీ అయిపోతున్నారు.