టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో ప్రస్తుతం `ఎస్ఎస్ఎమ్బీ 28` వర్కింగ్ టైటిల్ తో ఓ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. హారిక అండ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై సూర్యదేవర రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్లు నటిస్తున్నారు.
తమన్ స్వరాలు అందిస్తున్నాడు. ఇటీవలె సెట్స్ మీదకు వెళ్తిన ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ తెరపైకి వచ్చింది. అదేంటంటే.. ఈ సినిమాలో ఓ ఐదు నిమిషాల సన్నివేశం కోసం ఏకంగా రూ. 10 కోట్లు ఖర్చు పెడుతున్నారు.
హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో ఈ సినిమాకు కోసం ఒక భారీ ఇంటి సెట్ ని వేస్తున్నాడు. ఆర్ట్ డైరెక్టర్ ఏఎస్. ప్రకాష్ ఆద్వర్యం లో ఈ సెట్స్ ని నిర్మిస్తున్నారు. ఈ సెట్ కోసం దాదాపు పది కోట్ల బడ్జెట్ పెడుతున్నారని ఓ వార్త ఇప్పుడు నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఈ విషయం తెలిసి నెటిజన్లు షాకైపోతున్నారు. ఐదు నిమిషాల సన్నివేశం కోసం అన్ని కోట్లు అవసరమా.. సినిమా రిజల్ట్ లో ఏమైనా తేడా వస్తే త్రివిక్రమ్ పని గోవింద అంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.