మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మూవీ కోసం మెగా అభిమానులు 1000 కళ్ళతో ఎదురుచూస్తున్నారు. త్రిబుల్ ఆర్ వంటి పాన్ ఇండియా హిట్ తరవాత తన తండ్రి చిరంజీవి నటించిన ఆచార్య సినిమాలో నటించి ఘోరమైన ప్లాఫ్ అందుకున్నాడు.. అప్పటినుంచి చరణ్ అభిమానులు ఓ సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ సందర్భంలోనే సౌత్ స్టార్ డైరెక్టర్ శంకర్ తో తన 15వ సినిమా చేస్తున్నాడు.
ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు కంప్లీట్ అవుతుందా..? ఎప్పుడు థియేటర్లోకి వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చాలా వరకు పూర్తి అవ్వగా.. కొన్ని కీలక సన్నివేశాలను మాత్రమే తెరకెక్కించాల్సి ఉన్నట్టు తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఈ సినిమా షూటింగ్ నుంచి లేటెస్ట్ అప్డేట్ ఇచ్చాడు దర్శకుడు శంకర్. ఇక ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్లో చార్మినార్ వద్ద చేయబోతున్నట్టు సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. సోషల్ మీడియాలో చార్మినార్ దగ్గర ఉన్న ఓ ఫోటోని కూడా షేర్ చేశాడు.
అయితే ఈ సినిమాలోని ఓ యాక్షన్ సన్నివేశం కానీ, ఓ సాంగ్ కానీ ఇక్కడ షూట్ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. చార్మినార్ దగ్గర షూటింగ్ కంప్లీట్ అయిన తరవాత ఈ సినిమా టీం రాజమండ్రి వెళ్తారని తెలుస్తుంది. ఇప్పటికే ఈ సినిమాలోని ఫారెన్ షెడ్యూల్ షూటింగ్ కూడా కంప్లీట్ చేసుకుంది. న్యూజీలాండ్లో రామ్ చరణ్ కియారా అద్వానీపై డ్యూయెట్ సాంగ్ ను కూడా చేశారు. ఈ సాంగ్ కోసం దాదాపు 15 కోట్ల వరకు ఖర్చుపెట్టినట్టు తెలుస్తుంది.. అలాగే 500 మంది డాన్సులతో మరో ఇంట్రెస్టింగ్ సాంగ్ కూడా శంకర్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది.
రామ్ చరణ్ ఈ సినిమాల తన పాత సినిమాలకు భిన్నంగా ఎంతో స్టైలిష్ గా రెండు విభిన్నమైన పాత్రలో కనిపించబోతున్నట్టు తెలుస్తుంది. ఇక మరి రామ్ చరణ్ ఈ సినిమాతో ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తారో చూడాలి. ఈ సినిమాను తెలుగు స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఎంతో గ్రాండ్ గా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు.
Commencing the next schedule of #RC15 at the iconic Charminar pic.twitter.com/uubP5P0aV1
— Shankar Shanmugham (@shankarshanmugh) February 9, 2023