టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఒకరు. పంజాబీ నుంచి వచ్చిన ఈ ముద్దుగుమ్మ ముందుగా తెలుగులో కెరటం అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత సందీప్ కిషన్ హీరోగా వచ్చిన వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాతో టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమా తర్వాత నుంచి టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోల సినిమాల్లో నటించే అవకాశం దక్కించుకుని తెలుగు చిత్ర పరిశ్రమలోనే స్టార్ హీరోయిన్గా ఎదిగింది.
గత కొంతకాలంగా రకుల్ ప్రీత్ సింగ్ తెలుగులో సినిమాలు చేయటం లేదు. తన ఫోకస్ మొత్తం బాలీవుడ్ మీద పెట్టి అక్కడ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. ఇదిలా ఉంటే ఇప్పుడు రకుల్ ప్రీత్ సింగ్ గురించి షాకింగ్ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రకుల్ ప్రీత్ సింగ్కి ఓ స్టార్ హీరో భార్య అంటే ఎంతో భయమట.
రకుల్నే భయపెట్టిన ఆ స్టార్ హీరో భార్య ఎవరో కాదు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ భార్య. అవును అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డికి రకుల్ ప్రీత్ సింగ్ ఎంతో భయపడుతుందట. ఇక దానికి ముఖ్య కారణం అల్లు అర్జున్ తనతో కలిసి నటించే హీరోయిన్లతో ఎంతో క్లోజ్ గా ఉంటారు. ఈ క్రమంలోనే రకుల్ ప్రీత్ సింగ్ తో కూడా సరైనోడు సినిమా షూటింగ్ సమయంలో కాస్త క్లోజ్ గా ఉండేవాడు.
దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకున్న రకుల్ ప్రీత్ సింగ్ ప్రతిసారి అల్లు అర్జున్ కి ఫోన్ చేసి విసిగించేదట. దాంతో ఇది చూసిన అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి తన పలుకుబడితో రకుల్ కి ఫోన్ చేసి ఆమెను ఎడాపెడ వాయించేసిందట. అప్పటి నుంచి రకుల్ ప్రీత్ సింగ్ స్నేహారెడ్డిని చూస్తే భయపడుతుందట. ఈ ఇష్యూ దగ్గర నుంచి రకుల్ తెలుగు చిత్ర పరిశ్రమకు దూరమైందనే టాక్ కూడా నడుస్తుంది.