బిగ్గెస్ట్ డిజాస్ట‌ర్ ఇచ్చిన డైరెక్ట‌ర్‌కు ప్ర‌భాస్ మ‌రో ఛాన్స్‌.. వ‌ద్దు బాబోయ్ అంటున్న ఫ్యాన్స్‌!

ప్రస్తుతం పాన్‌ ఇండియా స్టార్ ప్రభాస్ చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో `స‌లార్‌`, నాగ్ అశ్విన్ తో `ప్రాజెక్ట్‌-కె`, మారుతి డైరెక్ష‌న్ లో `రాజా డిలక్స్‌` చిత్రాలు చేస్తున్నాడు. ఈ మూడు చిత్రాలు సెట్స్ మీదే ఉన్నాయి. వీటిని ఏక‌కాలంలో పూర్తి చేసే ప‌నిలో ప‌డ్డాడు ప్ర‌భాస్‌.

ఇవి పూర్తైన వెంట‌నే సందీప్ రెడ్డి వంగాతో `స్పిరిట్‌`, బాలీవ‌డ్ డైరెక్ట‌ర్ సిద్ధార్థ్ ఆనంద్ తో ఓ సినిమా చేసేందుకు ప్ర‌భాస్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడు. అయితే తాజాగా మ‌రో ఇంట్రెస్టింగ్ న్యూస్ తెర‌పైకి వ‌చ్చింది. అదేంటంటే.. ప్ర‌భాస్ తాజాగా మ‌రో డైరెక్ట‌ర్ కు ఓకే చెప్పాడ‌ట‌. ఇంత‌కీ ఆ డైరెక్ట‌ర్ మ‌రెవ‌రో కాదు కె. రాధాకృష్ణ కుమార్.

ప్ర‌భాస్‌, రాధాకృష్ణ కాంబినేష‌న్ లో `రాధేశ్యామ్` సినిమా వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. గ‌త ఏడాది భారీ అంచ‌నాల న‌డుమ విడుద‌లైన ఈ చిత్రం బిగ్గెస్ట్ డిజాస్ట‌ర్ గా నిలిచింది. క‌నీసం అభిమానులు కూడా ఈ సినిమా మెప్పించ‌లేక‌పోయింది. ఇప్పుడు అదే డైరెక్ట‌ర్ కు ప్ర‌భాస్ మ‌రో ఛాన్స్ ఇచ్చాడ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. వీరి కాంబో సినిమాని ఒక ప్రముఖ టాలీవుడ్ సంస్థ నిర్మించానుందని టాక్ న‌డుస్తోంది. దీంతో వ‌ద్దు బాబోయ్‌.. రాధాకృష్ణ‌కు మ‌రో ఛాన్స్ ఇవ్వ‌కు అంటూ ప్ర‌భాస్ ను ఫ్యాన్స్ రిక్వెస్ట్ చేస్తున్నారు.