మొదట చిన్న సినిమాగా వచ్చి తన సంచలన విజయాన్ని అందుకుంది కాంతారా చిత్రం. కన్నడ సినీ ఇండస్ట్రీకి మరొక మైలురాయిగా నిలిచింది ఈ చిత్రం ఇందులో హీరోగా డైరెక్టర్ గా రిషబ్ శెట్టి దర్శకత్వం వహించారు. భారీ విజయాన్ని అందుకుంది ఈ చిత్రం. ముందుగా ఈ సినిమా సూపర్ హిట్ టాక్ వచ్చిన తర్వాత మిగిలిన పలు భాషలలో విడుదల అయింది. దాదాపుగా ఈ సినిమా రూ.16 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించారు. ఏకంగా ఈ సినిమా రూ.450 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టింది.
ఈ సినిమాపై సర్వతా ప్రశంసలు అందుకుంది. ముఖ్యంగా ఈ చిత్రంలో హీరో రిషబ్ శెట్టి నటన ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా క్లైమాక్స్ 20 నిమిషాల పాటు ప్రేక్షకులను థియేటర్లో దద్దరిల్లిపోయేలా చేసిందని చెప్పవచ్చు. ఇప్పటికే దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్న కాంతార చిత్రం ఇప్పుడు మరొక అరుదైన ఘనతలు కూడా అందుకుంది. ఏకంగా ఆస్కార్ బరిలో నిలిచి ఇండియన్ సినిమా లవర్స్ గర్వపడేలా చేసింది. కాంతారా సినిమా ఆస్కార్ కు నామినేట్ అయిందని చిత్ర బృందం ఓం భలే ఫిలిమ్స్ ప్రొడక్షన్ వారు తెలియజేయడం జరిగింది.
రెండు విభాగాలలో ఆస్కార్ నామినేషన్ అయ్యిందని బెస్ట్ మూవీ అవార్డు బెస్ట్ యాక్టర్ అవార్డులకు గాను 95 ఆస్కార్ కు నామినేట్ అవ్వడంతో చిత్ర యూనిట్ ఆనందం వ్యక్తం చేసింది.. ఇలా ఉంటే ఈ సినిమాకు ఇప్పుడు సీక్వెల్ రాబోతోంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఒక అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ఈ చిత్రంలో కీలకమైన పాత్ర కోసం బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా సెలెక్ట్ చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.
View this post on Instagram