యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్ సినిమాతో ఇండియాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా తన క్రేజ్ ను పెంచుకున్నాడు. ఈ సినిమా తర్వాత తన తర్వాత సినిమాను స్టార్ దర్శకుడు కొరటాల శివతో ప్రకటించాడు. మరి కొద్ది రోజుల్లోనే ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభం కానుంది. ఈ సినిమా తర్వాత తన 31వ సినిమాను ఎన్టీఆర్ ప్రశాంత్ నిల్ డైరెక్షన్లో చేయబోతున్నాడు.
అయితే ఎప్పుడు టాలీవుడ్ యంగ్ ప్రొడ్యూసర్ నాగ వంశి ప్రస్తుతం మహేష్ 29వ సినిమాను త్రివిక్రమ్ తో చేస్తున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా నాగ వంశీ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘నేను ఎన్టీఆర్ గారికి ఓ వీర అభిమాని అనేది అందరికీ తెలిసిన విషయమే.. ఇక ఇటీవల మా బ్యానర్ లో కొన్ని అనుకోని కారణాలవల్ల ఎన్టీఆర్, త్రివిక్రమ్ల కాంబో మూవీ ఆగిపోయింది’.
‘అయితే రాబోయే రోజుల్లో తమ బ్యానర్ లో ఎన్టీఆర్ తో ఇప్పటివరకు ఎవరూ చేయని భారీ పౌరాణిక సినిమా చేయాలనే ఆలోచన తమకు ఉందని ఆయన చెప్పుకొచ్చాడు’. ‘ఇక ఆ సినిమాను స్టార్ దర్శకుడు త్రివిక్రమ్ డైరెక్ట్ చేయబోతున్నారని.. అయితే త్రివిక్రమ్ గారికి ఇది కొత్త జోనర్ కాబట్టి దీనిని ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేలా గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు’. కాగా దీని గురించి రాబోయే రోజుల్లో పూర్తి వివరాలు రివిల్ చేస్తామని నాగ వంశీ చెప్పుకొచ్చారు.