ఆ దిగ్గజ డైరెక్టర్‌తో ఎన్టీఆర్ మూవీ.. నేషనల్ అవార్డ్ గ్యారెంటీ..??

ప్రముఖ డైరెక్టర్ వెట్రిమారన్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎన్టీఆర్ తో తియ్యబోతున్నారు అనే గుసగుసలు వినపడుతున్నాయి. దీని గురించి ఆల్రెడీ పెద్ద ఎత్తున వార్తలు కూడా వచ్చాయి. అయితే ఈ సినిమాపై అధికారిక ప్రకటన మాత్రం ఇంకా రాలేదు. అయితే ఈ ప్రాజెక్ట్ రెండు భాగాలుగా ఉంటుందని, ఒక పార్ట్ ఎన్టీఆర్, మరో పార్ట్‌లో ధనుష్ నటిస్తారని సమాచారం. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా గురించి ఒక ఆసక్తికరమైన చర్చ ప్రారంభమైంది. అదేంటంటే, ఈ మూవీతో ఎన్టీఆర్ కచ్చితంగా నేషనల్ అవార్డు కొడతాడని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

సాధారణంగా మన తెలుగు సినిమాలు అంటే తమిళ్ ఆడియన్స్ పెద్దగా ఆసక్తి చూపించరు. పైగా టాలీవుడ్ స్టార్ట్ హీరోల డ్యాన్స్, పాటలు, నటన పై రకరకాల ట్రోల్స్ చేసి ఆనందపడుతూ ఉంటారు. అయితే వెట్రిమారన్ డైరెక్ట్ చేస్తున్న ఈ రెండు భాగాల ఎన్టీఆర్ సినిమా పై తమిళ అభిమానలు ఎంతో ఉత్సాహం చూపిస్తున్నారు. అయితే ఆ ఉత్సాహం ఎన్టీఆర్ ని చూసి కాదు డైరెక్టర్ వెట్రిమారన్ ని చూసి లేదంటే, ప్రాజెక్ట్ లో భాగం అవుతున్న ధనుష్ ని చూసి కావొచ్చు. అయితే ఈ సినిమా ఆర్ఆర్ఆర్ రేంజ్ లో ఉంటుందని వారు ఆశపడుతున్నారు.

వెట్రిమారన్ పొల్లాధవన్ (2007)తో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. అతని రెండో చిత్రం ఆడుకాలం (2011) ఆరు జాతీయ చలనచిత్ర అవార్డులను గెలుచుకుంది. అతని చిత్రం విసరనై (2016) అకాడమీ అవార్డులకు నామినేట్ అయ్యింది. అతని చిత్రం అసురన్ (2019) తమిళంలో ఉత్తమ చలనచిత్రంగా జాతీయ చలనచిత్ర అవార్డును అందుకుంది. చెప్పాలంటే అతడి సినిమాల ద్వారానే ధనుష్ గొప్ప స్టార్ అయ్యాడు. అంతేకాదు 2 నేషనల్ అవార్డులు కూడా గెలుచుకున్నాడు. కాగా ఇప్పుడు అతడి డైరెక్షన్‌లో జూ.ఎన్టీఆర్ నటిస్తే నేషనల్ అవార్డు కొట్టడం ఖాయమని చాలామంది అనుకుంటున్నారు.

ఇకపోతే ప్రస్తుతం కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్న సినిమాలో ఎన్టీఆర్ నటిస్తున్నారు. దీని తరువాత ప్రశాంత్ నీల్ తో ఒక ప్రాజెక్ట్ రెడీగా ఉంది. ఇక ఈ రెండు అయిపోయాక ఎన్టీఆర్ – ధనుష్ – వెట్రిమారన్ సినిమా మొదలు పెట్టే అవకాశాలు ఉన్నాయి.