నటి రోజాని తెగ పొగిడేసిన లలిత జ్యువెలర్స్ MD?

నటి రోజా గురించి ప్రత్యేకించి తెలుగువాళ్ళకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. 90sలో టాలీవుడ్లో ఒక ఊపుఊపిన రోజా ఆ తరువాత రాజకీయాల్లోకి వచ్చి నేడు MLAగా ఆంధ్ర రాజకీయాలలో తనదైన ముద్ర వేస్తున్నారు. అలాగే లలిత జ్యువెలర్స్ గురించి కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇరు తెలుగు రాష్ట్రాలలో సుమారు 45 బ్రాంచ్లను ఏర్పాటు చేసి, అందరికీ చేరువైనటువంటి వారిలో లలిత జ్యువెలర్స్ ఓనర్ MD కిరణ్ ఒకరు. “డబ్బులు ఊరికే రావు” అనే ఒక్క డైలాగ్ తో ఈయన ఎంతో ఫేమస్ అయ్యారో చెప్పాల్సిన పనిలేదు.

ఈ క్రమంలో తాజాగా చిత్తూరులో ‘లలిత జ్యువెలర్స్’ బ్రాంచ్ ఏర్పాటు చేశారు. ఈ బ్రాంచ్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి సినీనటి రోజాని ప్రత్యేకంగా ఆహ్వానించడం జరిగింది. రోజా చేతుల మీదుగా చిత్తూరు జిల్లాలో లలిత జ్యువెలర్స్ కొత్త షోరూం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో భాగంగా రోజా చేతుల మీదగా రిబ్బన్ కట్ చేసి ఈ షోరూం ప్రారంభించారు. ఈ సందర్భంగా కిరణ్ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ తన కొత్త షోరూం ప్రారంభించడానికి రోజా గారిని ఆహ్వానించడం కోసం తన టీం మొత్తం కలిసి తన ఇంటికి వెళ్లినట్లు తెలపడం గమనార్హం.

ఇకపోతే, వారి టీమ్ అలా రోజా గారి ఇంటికి వెళ్ళగానే ఎంతో మర్యాదపూర్వకంగా ఆహ్వానించారట రోజా. అంతేకాకుండా విందుభోజనాలు కూడా ఏర్పాటు చేసినట్టు ఈ సందర్భంగా తెలిపారు. వారి ఆహ్వానం మన్నించి రోజా సదరు షోరూం ప్రారంభించినందుకు ఆమెకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు కిరణ్. “మనం అనుకున్న గెస్ట్ వచ్చి షోరూమ్ ప్రారంభిస్తే కలిగే సంతోషమే వేరు!” అంటూ ఈయన తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుతం రోజా గురించి కిరణ్ చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతుండగా చాలామంది నెటిజన్లు చాలా ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు… ‘బాగా సరిపోయారు ఇద్దరూ’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.