పుష్ప సినిమాతో అల్లు అర్జున్ పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు.. పాన్ ఇండియా హిరోగా వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. పుష్ప2 తర్వాత రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమా చేసే అవకాశం ఉందని కూడా అంటున్నారు. పుష్ప 2 సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది. వైజాగ్ లో ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది. పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ బాలీవుడ్ లో కూడా పలు సినిమాలు చేసే అవకాశం ఉందని అంటున్నారు.
ఇప్పుడు ఇదిలా ఉంటే అల్లు అర్జున్ తోలి సినిమా గంగోత్రి ఈ సినిమాను దర్శకేంద్రుడు కే.రాఘవేంద్రరావు తన 100వ సినిమాగా తెరకెక్కించాడు. ఈ సినిమాతో చిత్ర పరిశ్రమలోకి వచ్చిన అల్లు అర్జున్ ఇప్పుడు ఈ స్థాయికి వెళ్ళాడు. అయితే ఇప్పుడు గంగోత్రి సినిమా గురించి నాగబాబు పలు ఆసక్తికర విషయాలు చెప్పారు.
గంగోత్రి సినిమాలో హీరోగా నటించడానికి మొదట రామ్ చరణ్కు ఆఫర్ వచ్చిందని, అయితే చిరంజీవి వల్ల అల్లు అర్జున్ ఈ సినిమాలో హీరోగా సెలెక్ట్ అయ్యాడని చెప్పుకొచ్చాడు. ముందుగా రామ్ చరణ్ కి గంగోత్రి సినిమాలో హీరోగా అవకాశం వచ్చిన చరణ్ హీరోగా పరిచయం అవడానికి ఆ సమయానికి చాలా చిన్నవాడని భావించిన చిరు.. ఈ సినిమాకు అల్లు అర్జున్ హీరోగా సెట్ అవుతాడంటూ అతని రిఫర్ చేశాడట.
గంగోత్రి సినిమా అవకాశం వచ్చినప్పుడు రామ్ చరణ్ కి సినిమాలపై సరైన అవగాహన లేకపోవటం వల్లే చిరంజీవి ఇలా చేశారని నాగబాబు చెప్పుకొచ్చాడు. కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాతోనే ఆర్తీ అగర్వాల్ చెల్లి అతిథి అగర్వాల్ హీరోయిన్గా పరిచయం అయ్యింది.