అమిగోస్.. నేడు విడుదలైన చిత్రమిది. `బింబిసార` వంటి బ్లాక్ బస్టర్ హిట్ అనంతరం కళ్యాణ్ రామ్ `అమిగోస్ తో ప్రేక్షకులను పలకరించాడు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్పై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ నిర్మించిన ఈ సినిమాకు రాజేంద్రరెడ్డి దర్శకత్వం వహించాడు. ఇందుకులో కన్నడ బ్యూటీ ఆషికా రంగనాథ్ హీరోయిన్ గా నటించింది.
కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే తొలిసారి త్రిపాత్రాభినయం చేసిన చిత్రమిది. మాఫియా బ్యాక్డ్రాప్లో నడిచే యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. మనుషులను పోలిన మనుషులు అనే కాన్సెప్ట్తో ఈ సినిమాను తెరకెక్కించారు. ఇందులో కళ్యాణ్ రామ్ సిద్దార్ధ్ అనే ఎంటర్ప్రెన్యూర్గా, మంజునాథ్ అనే సాఫ్ట్వేర్ ఇంజినీర్ గా, మైఖేల్ అనే గ్యాంగ్ స్టర్గా కనిపించాడు. మూడు పాత్రలకు వైవిద్యత చూపిస్తూ కళ్యాణ్ రామ్ అదరగొట్టేశారు.
డీసెంట్ టాక్ సొంతం చేసుకున్న ఈ చిత్రం.. బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వసూళ్లను రాబడుతుంది అన్నది ఆసక్తికరంగా మారింది. ఇకపోతే అమిగోస్ ఓటీటీ పాట్నర్ లాక్ అయింది. ప్రముఖ దిగ్గజ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ను కొనుగోలు చేశారట. దాదాపు రూ. 15 కోట్లకు డీల్ క్లోజ్ అయిందని టాక్ నడుస్తోంది. ఇక థియేటర్లలో రిలీజైన నాలుగు నుంచి ఆరు వారాల తర్వాత అమిగోస్ ను ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేలా ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిసింది.