అలాంటి సలహాలను గౌరవిస్తానంటోన్న జాన్వీ కపూర్… విషయమిదే!

అందాల అలనాటి తార శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన పనిలేదు. శ్రీదేవి, బోనీకపూర్ ల ముద్దుల తనయగా బూవుడ్ పరిశ్రమలోకి అడుగు పెట్టిన జాన్వీకపూర్ అనతికాలంలోనే మంచి పేరు సంపాదించింది. అందానికి తోడు మంచి అభినయం కూడా ఉండడంతో నార్త్ ప్రేక్షకులు ఆమెని యాక్సెప్ట్ చేసారు. సినిమా నేపథ్యం ఉన్నా తనకంటూ గుర్తింపు కోసం కొత్తదారిలో వెళుతున్న జాన్వీకి నెపోటిజం బాధలయితే తప్పలేదు గాని, తనపని తాను చేసుకుంటూ అభివృద్ధి పధంలో దూసుకుపోతోంది.

పలు సందర్భాల్లో నేపాటిజంపైన మాట్లాడిన జాన్వీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మరోసారి తన భావాలను పంచుకుంది. ఆమె మాట్లాడుతూ… ‘మనం ఎంత కష్టపడినా, నెపో బేబీ మీకు నటించడం రాకపోతే ఎందుకు చేస్తున్నారు? అని సామాజిక మాధ్యమాల్లో అనే సూటీపోటీ మాటలు అప్పుడప్పుడు నిజంగా బాధిస్తున్నాయి. అదే సమయంలో మీరు `మిలీ’లో బాగా నటించారు. తరవాత సినిమాలో ఇంకా బాగా చేయండి! అంటే నేను దానిని గౌరవిస్తాను’ అని చెప్పింది.

కాగా జాన్వీ కపూర్ ఈ సంవత్సరం రిలీజు కాబోతున్న ‘బవాల్’, ‘మిస్టర్ అండ్ మిసెస్ మహి’ చిత్రాల కోసం వేయి కళ్ళతో ఎదురుచూస్తోంది. ఎందుకంటే ఆ రెండు సినిమాలపైనే అమ్మడు సినిమా కెరీర్ ఆధారపడి వుంది. అందుకే వేయికళ్లతో ఆ సినిమాల రిలీజ్ కోసం వేచి చూస్తోంది. ఆ సినిమాల ద్వారా అమ్మడి పేరు బాలీవుడ్లో మోతమోగడం ఖాయం అని బాలీవుడ్ వర్గాలు ఘోషిస్తున్నాయి. ఇక ఆమె సౌత్ సినిమాలలో కూడా నటించే అవకాశం లేకపోలేదు. త్వరలో మన తెలుగు సినిమాకు సైన్ చేయబోతున్నట్టు తెలుస్తోంది.