`మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్` తో తొలి హిట్ అందుకున్న అఖిల్ అక్కినేని.. తన తదుపరి చిత్రాన్ని స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డితో ప్రారంభించాడు. అదే `ఏజెంట్`. ఏకే ఎంటర్టైన్మెంట్స్, సురేందర్ 2 సినిమా బ్యానర్లపై రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ సినిమాతో సాక్షి వైద్య టాలీవుడ్ కు పరిచయం కాబోతోంది.
ఇందులో మలయాళ స్టార్ మమ్ముటి కీలక పాత్రను పోషించాడు. ఎప్పుడో షూటింగ్ పూర్తి అయినా ఈ సినిమా విడుదలకు మోక్షం మాత్రం లభించడం లేదు. ఇప్పటికే మేకర్స్ అనేక తేదీలను ప్రకటించి వాయిదా వేశారు. ఫైనల్ గా ఏప్రిల్ 28న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాను విడుదల చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. రీసెంట్ గా ఫస్ట్ సాంగ్ ను బయటకు వదిలి ప్రమోషన్స్ కూడా షురూ చేశారు.
ఇకపోతే ఏజెంట్ థియేట్రికల్ రైట్స్ కళ్లు చెదిరే ధర పలికాయట. ‘ఏజెంట్’ కర్ణాటక, తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్ను అనిల్ సుంకర తాజాగా అమ్మేశారట. వైజాగ్కు చెందిన గాయత్రి ఫిలిమ్స్ ఈ రాష్ట్రాల హక్కులను రూ.34 కోట్లు చెల్లించి కొనుగోలు చేసిందని ఫిల్మ్ నగర్ వర్గాలు తెలుపుతున్నాయి. ఇదే నిజమైతే అఖిల్ ఎదుట భారీ టార్గెట్ ఉండటం ఖాయం అవుతుంది.