మనీ విషయంలో సాయి పల్లవి బిహేవియర్ ఇలా ఉంటుందా.. మరి ఇంత దారుణమా..!

తెలుగు చిత్ర పరిశ్రమలో అలనాటి హీరోయిన్స్ లో సావిత్రి ఆ తర్వాత వచ్చిన వారిలో సౌందర్య, స్నేహ వంటి నటిమణులు తర్వాత ఈ తరం హీరోయిన్స్ లో ఎలాంటి ఎక్స్పోజింగ్ చేయకుండా కేవలం తన నటనతోనే ప్రేక్షకుల‌ను ఆకర్షించిన హీరోయిన్ ఎవరైనా ఉన్నారా అంటే అది కేవలం సాయి పల్లవి అని అందరూ ఠక్కున చెబుతారు. ఎలాంటి ఎక్స్పోజింగ్ చేయకుండా కేవలం తన అందం, అభినయంతోనే సాయి పల్లవి ఇంతటి పేరు తెచ్చుకుంది.

అంతేకాకుండా తాను చేసే సినిమాల్లో మేకప్ కూడా చాలా తక్కువగా వేసుకొని నటిస్తుందట. ఈ ముద్దుగుమ్మ మలయాళం ప్రేమమ్ సినిమాతో చిత్ర పరిశ్రమకు పరిచయమైంది. ఆ తర్వాత తెలుగులో శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ఫిదా సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమాతోనే తన నటనతో అందరినీ ఆకట్టుకుంది. తాను నటించే సినిమాలలో గ్లామర్ పాత్రలకు, రొమాంటిక్ సన్నివేశాలకు ఆమడ దూరంలో ఉంటుంది. తాను చేసే పాత్రలో ఏమాత్రం వలిగారిటీ లేకుండా నటిస్తుంది.

ఈ క్రమంలోనే గత కొన్ని రోజులుగా సాయి పల్లవి సినిమాలలో నటించడం లేదు అంటూ ఆమె పై ఎన్నో రూమర్లు కూడా వస్తున్నాయి.. సినిమాలు గుడ్ బాయ్ చెప్పేసింది అనే వార్తలు కూడా వస్తున్నాయి. ఈ విషయాలు పక్కనపెడితేే. ఇప్పుడు సాయి పల్లవి కి సంబంధించి ఓ షాకింగ్ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వార్త ఏమిటంటే సాయి పల్లవి తన రెమ్యూనరేషన్ తీసుకున్నాక ఏం చేస్తుందో ఇప్పుడు చూద్దాం.

Sai Pallavi writes a beautiful note for her sister Pooja Kannan's debut -  Film News Portal

సాయి పల్లవికి సినిమా కమిట్ అయిన వెంటనే నిర్మాత చెక్కు ఇవ్వగానే దాన్ని తీసుకుని ముందుగా తన ఇష్ట దైవం వద్ద పెట్టుకుని పూజ చేసి.. ఆ తర్వాత ఆ చెక్కు ని తన పేరెంట్స్ చేతిలో పెడుతుందట. ఇక తాను సినిమాలలోకి వచ్చినప్పటి నుంచే కాకుండా సాయి పల్లవికి ఎప్పుడు డబ్బులు వచ్చినా కూడా అలాంటి పని చేసేదట. ఇప్పుడు ఈ విషయం తెలిసిన చాలామంది షాక్ అవుతున్నారు. ఈ తరంలో ఇలాంటి హీరోయిన్లు ఉన్నారా అని అవాక్కవుతున్నారు.