ప్ర‌ముఖ ఓటీటీకి `వాల్తేరు వీర‌య్య‌` డిజిట‌ల్ రైట్స్‌.. స్ట్రీమింగ్ మాత్రం అప్పుడే అట‌!?

మెగాస్టార్ చిరంజీవి, మాస్ మ‌హారాజా ర‌వితేజ హీరోలుగా బాబీ ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకున్న మాస్ యాక్ష‌న్ క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్టైన‌ర్ `వాల్తేరు వీర‌య్య‌` నేడు అట్ట‌హాసంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. మైత్రీ మూవీ మేక‌ర్స్ వారు నిర్మించిన ఈ చిత్రంలో శృతి హాస‌న్‌, కేథ‌రిన్ హీరోయిన్లుగా న‌టించారు.

ఇందులో జాలరిపేట నాయకుడిగా చిరంజీవి న‌టిస్తే.. పోలీస్ ఆఫీస‌ర్ గా ర‌వితేజ న‌టించారు. భారీ అంచ‌నాల న‌డుమ విడుద‌లైన ఈ చిత్రానికి మిక్స్డ్ రివ్యూలు వ‌స్తున్నాయి. అయితే రిలీజ్ కు ముందు సినిమాపై విపరీతమైన బజ్ క్రియేట్ అవ్వడంతో ఓపెనింగ్స్ ఓ రేంజ్ లో వచ్చే ఛాన్స్ పుష్క‌లంగా ఉంది.

ఇక‌పోతే ఈ మూవీ ఓటీటీ పాట్న‌ర్ లాక్ అయింది. ప్ర‌ముఖ దిగ్గ‌జ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్ `వాల్తేరు వీర‌య్య‌` డిజిట‌ల్ రైట్స్ ను సాలిడ్ ధ‌ర‌కు సొంతం చేసుకుంద‌ని తెలుస్తోంది. అయితే థియేట‌ర్స్ విడుద‌లైన ఆరు వారాల త‌ర్వాతే ఈ చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్ అవ్వ‌నుంద‌ని అంటున్నారు.